AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medico Preethi: మెడికో ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్‌ విచారం.. మృతురాలి కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వోద్యోగం

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని..

Basha Shek
| Edited By: |

Updated on: Feb 27, 2023 | 7:04 AM

Share

నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా  కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ‘ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఃఖంలో ఆ కుటుంబం ఉంది. మెడికో స్టూడెంట్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ప్రీతి ఆత్మశాంతించాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా’ అని ఎర్రబెల్లి తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ ‘ మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని సంతాపం తెలియజేశారు.

మంత్రుల సంతాపం..

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని .. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని, వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాద కలిగిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రీతి మరణం పట్ల నివాళులు అర్పించిన మంత్రి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాశ్మీర్‌ను కట్ చేసిన అమెరికా.. భారత్‌ ఆగ్రహం
కాశ్మీర్‌ను కట్ చేసిన అమెరికా.. భారత్‌ ఆగ్రహం
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..