Hyderabad: శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్దం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్లో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకూ వైభవంగా జరిగేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎన్నికల వేళ కావడంతో శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్లతో యాత్రను ప్రతిక్షణం పర్యవేక్షించనున్నారు.
హైదరాబాద్లో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకూ వైభవంగా జరిగేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎన్నికల వేళ కావడంతో శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్లతో యాత్రను ప్రతిక్షణం పర్యవేక్షించనున్నారు.
నేడు శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా రామాలయాలు కళకళలాడుతున్నాయి. వీధివీధికి సీతారాముల కల్యాణం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు. హైదరాబాద్ లో ముఖ్యంగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్రను వైభవంగా జరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర ప్రారంభమైన శోభాయాత్ర.. బోయిగూడ కమాన్, గంగాబౌళి ఎక్స్ రోడ్, గాంధీ స్టాట్యూ, బేగంబజార్, ఆంధ్రా బ్యాంక్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగనుంది. శోభాయాత్రలో దేవతామూర్తుల భారీ ప్రతిమలు ఆకట్టుకోనున్నాయి. శోభాయాత్రలో 70వేల నుంచి లక్ష వరకూ భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతంగా జరిగేలా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. యాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖల అధికారులతో నగర సీపీ శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. ఇప్పటికే శోభాయాత్ర జరిగే రూట్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా శోభాయాత్ర ప్రారంభించి రాత్రి 10గంటలకల్లా ముగించాలని నిర్వాహకులకు సూచించారు. ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకూడదని, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంటోల్ నుంచి, సీసీ కెమెరాలు, డ్రోన్లతో యాత్రను ప్రతి క్షణం పర్యవేక్షిస్తామన్నారు హైదరాబాద్ పోలీసులు. భక్తులు పండుగ వాతావరణంలో శోభాయాత్రను జరపుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..