AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్ తీసుకునే వారిని అలా చేయాలట.. నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య..

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‎లో డ్రగ్స్‎పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పించారు. నార్కో టెర్రరిజంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్‎లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో సెమినార్‎ను ప్రారంభించారు.

డ్రగ్స్ తీసుకునే వారిని అలా చేయాలట.. నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య..
Telangana Drugs
Peddaprolu Jyothi
| Edited By: Srikar T|

Updated on: Mar 04, 2024 | 4:02 PM

Share

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‎లో డ్రగ్స్‎పై అవగాహన సదస్సు నిర్వహించారు. వరుసగా నమోదవుతున్న డ్రగ్స్ కేసుల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు డ్రగ్స్ భూతంపై అవగాహన కల్పించారు. నార్కో టెర్రరిజంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్‎లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో సెమినార్‎ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్ర వెంకటేశం, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది‌, పలు స్కూల్, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ 21 ఏళ్ళలోపు వాళ్ళకు మద్యం అమ్మకూడదు.. కాని ఎవరు పట్టించుకుంటున్నారని యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మండిపడ్డారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారి సినిమాలు చూడకూడదని సూచించారు. అలాంటి సినిమాలాను ఎంకరేజ్ చేయొద్దని అన్నారు. పిల్లలకు డబ్బులు ఇచ్చి పేరెంట్స్ చెడగొడుతున్నారని తెలిపారు. సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, మోడళ్లు, హోటల్ యజమానులు డ్రగ్స్‎కు అలవాటు పడుతున్నారు. అలాంటి వారి పరువు తీసే ట్రెండ్ సెట్ ఎందుకు చేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు చదువుల్లోనే పిల్లలను మానసికంగా ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారని, గ్రేడ్‎ల పరంగానే ప్రపంచం లేదు, ఈ విషయం గుర్తించుకోవాలన్నారు. పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరిది బాధ్యత పేరెంట్స్‌దా? టీచర్స్ దా? పిల్లలదా? పోలీసులదా? అని ప్రశ్నించారు. పిల్లల మానసిక స్థితిని పేరెంట్స్, టీచర్స్ గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని ప్రశ్నించారు. పిలల్లను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇంట్లో పరిస్థితుల కారణంగానే టీనేజ్ వయస్సులోని వారు డ్రగ్స్‎కి బానిసలుగా మారుతున్నారని, ఇటీవల కాలంలో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరు గుర్తించడం లేదని, జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…