AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramkrishna Mukkavilli: హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థాపకునికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. తొలి భారతీయుడిగా రికార్డు..

Ramkrishna Mukkavilli: గాలి నుంచి నీటిని తయారు చేయగల వ్యవస్థను నిర్మించడం ద్వారా నీటి కొరత సమస్యను అధిగమించడంలో సహాయపడే సాంకేతికతకు ఆయన మార్గదర్శకత్వం వహించారు.

Ramkrishna Mukkavilli: హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థాపకునికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. తొలి భారతీయుడిగా రికార్డు..
Ramkrishna Mukkavilli
Ayyappa Mamidi
|

Updated on: Jun 09, 2022 | 10:39 AM

Share

Ramkrishna Mukkavilli: గాలి నుంచి నీటిని తయారు చేయగల వ్యవస్థను నిర్మించడం ద్వారా నీటి కొరత సమస్యను అధిగమించడంలో సహాయపడే సాంకేతికతకు ఆయన మార్గదర్శకత్వం వహించారు. వాతావరణ నీటి ఉత్పత్తి సాంకేతికతను ఉపయోగించి.. మైత్రి ఆక్వాటెక్ సంస్థ గాలి నుంచి 100 మిలియన్ లీటర్లకు పైగా మంచినీటిని ఉత్పత్తి చేసింది. ఇప్పుడు రామకృష్ణ ముక్కవిల్లి మరో ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ (UNGC) ద్వారా నీటి నిర్వహణ కోసం గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (SDG) మార్గదర్శకుడిగా గుర్తింపు పొందిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ఆయన గతంలో UN గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా భారత SDG పయనీర్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు 2022 కోసం 10 కొత్త SDG పయనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

భారత్ తో పాటు 27 దేశాల్లో ప్రకృతి ఆధారిత నీటి పరిష్కారాలతో నీటి భద్రతను నిర్మించడంలో ముక్కవిల్లి చేసిన కృషి ఆయనకు ఈ గుర్తింపు పొందడంలో సహాయపడింది. గాలి నుంచి నీటిని తయారు చేసే సాంకేతికత.. నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో గృహ వినియోగదారుల అవసరాలు, అగ్ర ఫార్చ్యూన్- 500 కంపెనీలు, పెద్ద ప్రభుత్వ రంగ కంపెనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, సేవలందించే కమ్యూనిటీల అవసరాలను తీరుస్తుంది. ఇది 200 మిలియన్ లీటర్ల కీలకమైన భూగర్భ జల వనరులను రక్షించేందుకు దోహద పడిందని అంచనా.

“ఇలాంటి గుర్తింపులు ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో మేఘదూత్ వంటి స్థిరమైన నీటి పరిష్కారాల ప్రాముఖ్యతను, ప్రపంచ నీటి సమస్య తీవ్రతను ఖచ్చితంగా చూపుతాయి. ఈ గుర్తింపు గ్రహం అంతటా నీటి సంక్షోభాన్ని తగ్గించడంలో నా ప్రయత్నాలను బలపరుస్తుంది. ఇతరులను కూడా అదే విధంగా చేయమని నేను కోరుతున్నాను” అని ముక్కవిల్లి అన్నారు.