AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు.. తీవ్ర ఉద్రిక్తత.. జేసీబీకి అడ్డంగా వెళ్లి..

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్బర్‌నగర్‌లో అనధికారంగా నిర్మించిన షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలను ప్రతిఘటిస్తూ స్థానికులు జేసీబీకి ఎదురు నిలిచారు. తమ స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూల్చి వేయొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Hyderabad: పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు.. తీవ్ర ఉద్రిక్తత.. జేసీబీకి అడ్డంగా వెళ్లి..
Hydra
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Anand T

Updated on: May 08, 2025 | 3:53 PM

తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. నగరంలోని చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను, అక్రమ ఆస్తులను ధ్వంసం చేసి పేదవాడికి సరైన న్యాయం కల్పించేలానేది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ క్రమంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన ఎంతో మంది బడా బాబులకు చెందిన బిల్డింగ్‌లను హైడ్రా నేలమట్టం చేసింది. హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్యలపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నా.. మరోవైపు విమర్శిలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా చాంద్రాయణగుట్టలో హైడ్రా కూల్చివేతల వల్ల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.

హైదరాబాద్ నగరం పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని అక్బర్‌నగర్ ప్రాంతంలో నగర పాలక అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఇది కాస్తా స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ, అనధికారంగా నిర్మించబడిన షాపులను హైడ్రా నేతృత్వంలో అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలను ప్రతిఘటిస్తూ స్థానికులు జేసీబీకి ఎదురు నిలిచారు. తమ స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూల్చవద్దంటూ  నిరసన వ్యక్తం చేశారు. ఇది కాస్తా ముదిరి పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాటకు దారి తీసింది. నిబంధనల ప్రకారం అవన్నీ అక్రమ ఆస్తులనీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేతలు తప్పవని పోలీసులు వివరిస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు హైడ్రా పేరుతో తమ ఆస్తులను ధ్వంసం చేస్తే, ప్రభుత్వమే తమకు ఏదైనా మార్గం చూపించాలని నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. హైడ్రా కూల్చివేతల చర్యలకు వ్యతిరేకంగా AIMIM పార్టీకి చెందిన కార్పొరేటర్లు.. హైడ్రా, మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పాతబస్తీ ప్రజలకు ఇలాంటి ప్రభుత్వ చర్యలపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమన్నారు.  దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఇకనైనా హైడ్రా చర్యలపై ఒక నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..