AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : కూకట్‌పల్లిలో సెలూన్ యజమాని దారుణ హత్య.. షాపులోనే కిరాతకంగా చంపేసిన దుండగులు

సెలూన్ షట్టర్ తెరిచి చూడగా అశోక్ కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అశోక్‌ కార్మికుడు పంకజ్‌పై అనుమానంతో ఫిర్యాదు చేశారు.

Hyderabad : కూకట్‌పల్లిలో సెలూన్ యజమాని దారుణ హత్య..  షాపులోనే కిరాతకంగా చంపేసిన దుండగులు
Salon Owner Ashok
Jyothi Gadda
|

Updated on: Oct 17, 2023 | 12:26 PM

Share

హైదరాబాద్‌లో సెలూన్‌ యజమాని దారుణ హత్య కలకలం రేపింది. నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో సెలూన్ నిర్వహిస్తున్న వ్యక్తి (42)ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేసినట్టుగా పోలీసులు తెలిపారు. మృతుడు అశోక్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో సెలూన్‌ నిర్వహిస్తున్నాడు అశోక్. అయితే, గతంలో అశోక్‌ సెలూన్‌లో పనిచేసి మానేసిన పంకజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌ షాపుకు వచ్చే కస్టమర్లను పంకజ్‌తన సొంత సెలూన్‌కి మళ్లించుకున్నాడనే ఆరోపణతో అశోక్ అతనిని పనిలోంచి తొలగించాడని తెలిసింది. నాలుగు నెలల క్రితమే పంకజ్‌ని ఉద్యోగంలోకి తీసుకున్నాడని తెలిసింది.

ఇదిలా ఉండగానే. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత సెలూన్‌ షట్టర్‌ మూసివేసిన అశోక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య, కొడుకు సెలూన్‌కు వచ్చి చూశారు.. అక్కడ అశోక్‌ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భయపడిపోయామంటూ అశోక్‌ భార్య నీరజా కంప్లైట్‌ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. దుండగుడు అశోక్‌ను పలుమార్లు కత్తితో పొడిచి షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

అశోక్ భార్య నీరజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన భర్త సెలూన్‌కి వెళ్లాడని, తమ సెలూన్‌ ఇంటికి ఆనుకునే ఉంటుందని చెప్పింది. రాత్రి 10 గంటల తర్వాత కూడా సెలూన్‌ మూసి ఉండడం గమనించాం.. కానీ, తన భర్త తిరిగి రాలేదని.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది.. అతనిని పిలవడానికి ప్రయత్నించినప్పుడు సమాధానం లేదు. దాంతో అశోక్‌ భార్య, కొడుకు సెలూన్‌ లోపలికి వెళ్లామని, సెలూన్ షట్టర్ తెరిచి చూడగా అశోక్ కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు అశోక్‌ కార్మికుడు పంకజ్‌పై అనుమానంతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పంకజ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎం. సురేందర్‌ మాట్లాడుతూ పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే
పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే
వెల్లుల్లి తింటే దోమలు కుట్టవా..? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
వెల్లుల్లి తింటే దోమలు కుట్టవా..? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఫేమస్ హీరో
చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఫేమస్ హీరో
ఊరెళ్తున్నారా..? ఫ్రిజ్‌లో ఒక చెంచా పెట్టండి—కారణం తెలిస్తే షాక్
ఊరెళ్తున్నారా..? ఫ్రిజ్‌లో ఒక చెంచా పెట్టండి—కారణం తెలిస్తే షాక్
జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది
వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?
వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?
మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట
మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట
ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి
ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి
ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఇదే!!
ఆ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారట! ఆ భయంకర రహస్యం ఇదే!!