Hyderabad: రాజేంద్రనగర్లో అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి
బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాజేంద్రనగర్లో అదృశ్యమైన అనీష్ విగతజీవిగా కనిపించాడు.
బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాజేంద్రనగర్ లో గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన బాలుడి ఉదంతం విషాదాంతమైంది. ఇంటి వెనుక ఉన్న చెరువులో అనీష్ డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. గుంతలో పడి చనిపోయాడని పోలీసులు తేల్చారు. దీంతో బాలుడి పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ డివిజన్లోని హైదర్గూడలో నివసిస్తున్నారు అనీష్ కుటుంబ సభ్యులు. కొండల్రెడ్డి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయాడు ఆరేళ్ల అనీష్. నిన్న మధ్యాహ్నం సెల్లార్ లో అడుకునేందుకు వెళ్లిన అనీష్ ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుడి పేరెంట్స్. అయితే ఇవాళ ఉదయం శవమై కనిపించాడు. బాలుడి పిల్లాడి పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పది ప్రత్యేక బృందాలతో బాలుడి కోసం గాలించారు. చివరికి బాలుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం మిగిలింది.
అయితే అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదనేది అనుమానాస్పదంగా ఉందంటున్నారు బాలుడి పేరెంట్స్. సీసీ కెమెరాలు పనిచేస్తే ఇంత దారుణం జరిగేది కాదంటున్నారు. అపార్ట్మెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సీసీ కెమెరాలు ఆరు రోజులుగా పనిచేయడం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలుడి తండ్రి.
Also Read: పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు… లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్
Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు