Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో భారీ చోరీ.. రెండున్నర కిలోల బంగారంతో దుండగుల పరార్‌

హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో భారీ దొంగతనం జరిగింది. ఐటీ అధికారుల మంటూ హర్షా జ్యువెలరీస్‌ దుకాణంలోకి వచ్చిన కొందరు దుండుగులు అందరి కళ్లు గప్పి రెండున్నర కిలోల బంగారంతో పరారయ్యారు.

Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో భారీ చోరీ.. రెండున్నర కిలోల బంగారంతో దుండగుల పరార్‌
Gold Robbery
Follow us

|

Updated on: May 27, 2023 | 5:26 PM

హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో భారీ దొంగతనం జరిగింది. ఐటీ అధికారుల మంటూ హర్షా జ్యువెలరీస్‌ దుకాణంలోకి వచ్చిన కొందరు దుండుగులు అందరి కళ్లు గప్పి రెండున్నర కిలోల బంగారంతో పరారయ్యారు. దుకాణ యజమానులు అందించిన సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు ఆదాయపు పన్ను అధికారులమంటూ మోండా మార్కెట్లోని హర్షా జ్యూయెలరీస్ ఆభరణంలోకి వచ్చారు. తనీఖీలు చేపట్టాలంటూ బంగారం తీసుకున్నారు. ఆతర్వాత పరారయ్యారని బాధితులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి బాధితులు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు. నలుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిని అనుసరించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు.

నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..