AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Underwater Tunnel: దేశంలో నీటి అడుగున తొలి రోడ్డు, రైలు సొరంగం.. ఇక 6 గంటల ప్రయాణం నిమిషాల్లోనే..

Underwater Road, Rail Tunnel: ఇక రోడ్డు, రైలు మార్గం నీటి అడుగున నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏకంగా నది నీటి అడుగున ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తోంది. దీంతో 6 గంటల ప్రయాణం కేవలం నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది..

Underwater Tunnel: దేశంలో నీటి అడుగున తొలి రోడ్డు, రైలు సొరంగం.. ఇక 6 గంటల ప్రయాణం నిమిషాల్లోనే..
Underwater Road, Rail Tunnel
Subhash Goud
|

Updated on: Feb 22, 2026 | 7:53 AM

Share

Underwater Road, Rail Tunnel: భారతదేశంలో రైళ్లు, వాహనాలు నీటి అడుగున నడపడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అస్సాంలో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కింద దేశంలో మొట్టమొదటి రోడ్డు, రైలు సొరంగం బ్రహ్మపుత్ర నది కింద నిర్మించనున్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ రోడ్డు, రైలు మార్గాన్ని నీటి అడుగున ఏర్పాటు చేయనుంది.

నీటి అడుగున రైలు-రోడ్డు సొరంగం:

  • అస్సాంలోని గోహ్‌పూర్-నుమాలిఘర్ మధ్య.
  • పొడవు: 15.8 కి.మీ.లేన్
  • ప్రాజెక్టు వ్యయం: 4 లేన్ల సొరంగంప్రాజెక్టు వ్యయం – 18,662 కోట్లు
  • సమయం: నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాలు

6 గంటల దూరాన్ని నిమిషాల్లో ప్రయాణం:

జాతీయ రహదారి 715 లోని నుమాలిఘర్- NH-15 లోని గోహ్‌పూర్ మధ్య దూరం ప్రస్తుతం దాదాపు 240 కిలోమీటర్లు. సిలిఘాట్ సమీపంలోని కాలియాభంభోరా రోడ్డు వంతెన ద్వారా ప్రయాణించడానికి దాదాపు ఆరు గంటలు పడుతుంది. ఈ మార్గంలో వాహనాలు కాజీరంగ జాతీయ ఉద్యానవనం, విశ్వనాథ్ పట్టణం గుండా వెళ్ళవలసి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ కింద 15 కిలోమీటర్ల సొరంగం ఈ ప్రయాణాన్ని తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. గంటల పాటు ప్రయాణించే బదులు నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేసుకోవచ్చంటున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు.. పిల్లల కోసం బెస్ట్‌ ప్లాన్‌!

ఇవి కూడా చదవండి

ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (EPC) నమూనాపై అమలు చేస్తారు. ఈ సొరంగం అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైనది కావడంతో పాటు ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధికి దారితీస్తుంది.

పర్యాటక ప్రదేశాలు, ఆర్థిక కేంద్రాలు కూడా అనుసంధానం:

ఈ ప్రాజెక్ట్ అస్సాంలోని ప్రధాన ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలను అనుసంధానిస్తుంది. ఇది 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 2 పర్యాటక గమ్యస్థానాలు, 8 లాజిస్టిక్స్ నోడ్‌లను అనుసంధానించాలని యోచిస్తోంది. ఇది 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 లోతట్టు జలమార్గాలతో మెరుగైన బహుళ-మోడల్ ఏకీకరణను నిర్ధారిస్తుంది. ప్రయాణీకులు, వస్తువుల రవాణాకు సులభతరం అవుతుంది.

Gold Price Today: బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!