AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చత్రినాక గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష

2023లో ఛత్రినాకలో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు యువకులకు బాల నేరాల ప్రత్యేక న్యాయస్థానం 25 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితులు ఎం రాహుల్ (21), ఎం నితిన్ (19)లకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. జి దీక్షిత్, డి మల్లేష్‌లకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది..

Hyderabad: చత్రినాక గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష
Chatrinaka Gang Rape Case
Vijay Saatha
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 12:55 PM

Share

హైదరాబాద్, జనవరి 28: 14 ఏళ్ల మైనర్ లంబాడా అమ్మాయిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం చత్రినాక వద్ద చోటు చేసుకుంది. నిందితులు, అమ్మాయిని మాయమాటలు చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మద్యం తాగించేందుకు యత్నించారు. ఆమె నిరాకరించగా, నిందితులు ఆమెను లైంగికంగా వేధించారు. ఒకరు ఆమె పొట్టపై తన్నడంతో, ఆమె అచేతనంగా పడిపోయింది. కొన్ని గంటల తర్వాత, ఆమె స్పృహ లోకి వచ్చింది. తన బట్టలు చిరిగిపోయి ఉన్నాయని, శరీరంలో నొప్పిగా అనిపించిందని తెలిపింది. ఆపై, అక్కడి నుంచి బయటకు వచ్చి పరుగెత్తి.. తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపు కేసు నమోదైంది.

న్యాయ విచారణలో నిందితులు అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరారు. అయితే ఆమె న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో, బాలిక నిందితులను స్పష్టంగా గుర్తించింది. కోర్టులో పలుమార్లు నిందితుల తరపు న్యాయవాదులు క్రాస్ ఎక్జామినేషన్ చేసినా బాలిక ధైర్యంగా నిలబడిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. కోర్టు బాలికకు రూ.7 లక్షల పరిహారం మంజూరు చేసింది. అయితే, బాలికను ఈ ప్రమాదంలోకి లాగిన స్నేహితురాలు ఇంకా జువెనైల్ న్యాయ మండలిలో విచారణ ఎదుర్కొంటోంది.

ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ గా ఉన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులకు కోర్టు కఠినమైన శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు 25 సంవత్సరాల శిక్ష విధించగా, మరో ఇద్దరికి 5 సంవత్సరాల శిక్ష విధించింది. ఘటన అనంతరం బాధిత బాలికను వివాహం చేసుకునేందుకు నిందితులు సిద్ధ పడ్డారు. కానీ బాలిక న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగించి నిందితులకు శిక్ష పడేలా పోరాటం చేసిందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.