హైదరాబాద్లో పెట్రోల్, గ్యాస్ కష్టాలు షురూ?
తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన చర్లపల్లిలో ఇంధన సరఫరా ఒక్కసారిగా కుంటుపడింది. ఇక్కడి భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం , మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లాంట్ల నుంచి సరఫరా అయ్యే ఇంధనం గతంతో పోలిస్తే ఏకంగా 75 శాతం మేర తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మూడు ప్రధాన ప్లాంట్ల నుంచి కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మరియు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున చమురు సరఫరా అవుతుంది.
అయితే, ప్రస్తుతం నెలకొన్న కొరత కారణంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన లోడ్లు నిలిచిపోయాయి. చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంధన ట్యాంకర్లు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే టోకెన్ల వారీగా, అత్యంత పరిమిత సంఖ్యలో సిలిండర్లను కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు లేదా రవాణా సంబంధిత సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ సరఫరా నిలిచిపోవడం వల్ల రాబోయే రోజుల్లో రవాణా రంగంపైన, నిత్యావసర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్లో నయా స్ట్రాటజీ
అమెరికా పట్టుకున్న ఇరాన్ నౌకతో చైనా గుట్టురట్టు?
సునామీ అలర్ట్! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
అది క్రికెట్ గ్రౌండా?క్షుద్రపూజల వేదికా?
తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం..ఇటు వడగళ్ల వాన, అటు వడగాల్పుల
భారత్లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..
వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్ జీ
పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి 'మెషిన్ గన్'

