హైదరాబాద్లో పెట్రోల్, గ్యాస్ కష్టాలు షురూ?
తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన చర్లపల్లిలో ఇంధన సరఫరా ఒక్కసారిగా కుంటుపడింది. ఇక్కడి భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం , మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లాంట్ల నుంచి సరఫరా అయ్యే ఇంధనం గతంతో పోలిస్తే ఏకంగా 75 శాతం మేర తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మూడు ప్రధాన ప్లాంట్ల నుంచి కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మరియు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున చమురు సరఫరా అవుతుంది.
అయితే, ప్రస్తుతం నెలకొన్న కొరత కారణంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన లోడ్లు నిలిచిపోయాయి. చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంధన ట్యాంకర్లు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే టోకెన్ల వారీగా, అత్యంత పరిమిత సంఖ్యలో సిలిండర్లను కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు లేదా రవాణా సంబంధిత సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ సరఫరా నిలిచిపోవడం వల్ల రాబోయే రోజుల్లో రవాణా రంగంపైన, నిత్యావసర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్లో నయా స్ట్రాటజీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఐస్క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్లో అమెరికన్ టూరిస్ట్ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్ బుకింగ్.. భార్యను చంపిన భర్త అరెస్ట్
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

