AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పతంగులు ఎగురవేస్తూ గుట్టపైకి వెళ్లారు.. అక్కడ సీన్ చూసి పరుగో పరుగు..

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Hyderabad: పతంగులు ఎగురవేస్తూ గుట్టపైకి వెళ్లారు.. అక్కడ సీన్ చూసి పరుగో పరుగు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2025 | 5:00 PM

Share

హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణం చోటుచేసుకుంది.. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్థానికులు గాలిపటాలు ఎగరవేస్తుండగా గుట్ట దగ్గర రెండు మృతదేహాలు కనిపించడంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి.. ఇద్దరినీ.. దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.

మృతుల్లో యువతి, యువకుడు ఉన్నారు. ఇద్దరినీ కత్తులతో పొడిచి.. ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలం నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.

అయితే.. ఘటనా స్థలానికి కొంత దూరంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా..? లేక మరెవరైనా ఇంతటి ఘోరానికి పాల్పడ్డారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, షూ లను చూసి నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జీతం ఎలా ఖర్చు పెట్టాలి? బెస్ట్ ఫార్ములా ఇదే..
జీతం ఎలా ఖర్చు పెట్టాలి? బెస్ట్ ఫార్ములా ఇదే..