AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: విషాదం.. కరోనాతో హైదరాబాద్ గుడి మల్కాపూర్ కార్పొరేటర్ కూతురు మృతి

కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విప‌రీత‌మైన డ్యామేజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌ల్లోలం రేపుతోంది. భారీగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.

Coronavirus: విషాదం..  కరోనాతో హైదరాబాద్ గుడి మల్కాపూర్ కార్పొరేటర్ కూతురు మృతి
Corona Death
Ram Naramaneni
|

Updated on: May 09, 2021 | 3:51 PM

Share

కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విప‌రీత‌మైన డ్యామేజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌ల్లోలం రేపుతోంది. భారీగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. ఫ‌స్ట్ వేవ్ లో ఎక్కువ‌గా ఏజ్ ఏక్కువ ఉన్న‌వాళ్లు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నవారు క‌న్నుమూశారు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం యంగ్ పీపుల్ కూడా వ్యాధి భారినప‌డి క‌న్నుమూస్తున్నారు. తాజాగా హైదరాబాద్ గుడి మల్కాపూర్ బిజెపి కార్పోరేటర్ దేవర కరుణాకర్ కుమార్తె భవాణి క‌రోనా భారిన‌ప‌డి మృతి చెందింది. గతనెల 20న ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల్లోనే క‌రోనాతో క‌న్నుమూసింది. అయితే భవానీకు డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా వ్యాప్తి చెందిన‌ట్లు అనుమానిస్తున్నారు. 5 రోజుల పాటు వెంటిలేటర్ మీద వున్న భవాని ఆదివారం ఉద‌యం తుదిశ్వాస విడాచారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయ‌లు నెల‌కున్నాయి.

Also Read: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణయం.. ఆక్సిజ‌న్ కోసం భారీగా నిధులు విడుదల‌

మరో ఘనత సాధించిన నాసా.. తొలిసారి అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..