Telangana Rains: రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ!
రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులులో కూడిన వర్షాలు కురుస్తాయని.. వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

బుధవారం నుంచి రాజున్న ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులులో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. వర్షంతో పాటు పలు పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇర గురువారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతారణశాఖ పేర్కొంది. శుక్రవారం కూడా నిర్మల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు శని, ఆదివారాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు పడే సమయంలో రైతులు పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..