AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇకపై 8 గంటల ప్రయాణం కాదు.. కేవలం రెండున్నర గంటలే.!

సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, వందేభారత్ సర్వీసులు.. ఇలా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు చాలానే ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా.. సరికొత్తగా బులెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు ఇలా.. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

Hyderabad: హైదరాబాద్ టూ బెంగళూరు.. ఇకపై 8 గంటల ప్రయాణం కాదు.. కేవలం రెండున్నర గంటలే.!
Hyderabad To Bengaluru
Ravi Kiran
|

Updated on: Dec 03, 2025 | 8:46 AM

Share

హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణం సమయం తగ్గనుంది. సాధారణంగా ఈ రెండు ఐటీ నగరాల మధ్య ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, తాజాగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎకనామిక్ కారిడార్ల మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్-బెంగళూరు మార్గాన్ని ఎంచుకుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ కర్నూలు జిల్లా మీదుగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతోంది. అందుకు అనువైన ట్రాక్ నిర్మించేందుకు మట్టి నమూనాలను సేకరిస్తున్నారు అధికారులు.

కర్నూలు నుంచి బెంగళూరు వందేభారత్ ప్రయాణం సుమారు 5.30 గంటలు పడుతోంది. అది కూడా గరిష్ట వేగం 130 కిలోమీటర్లతో నడుపుతున్నారు. అదే బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఎక్కితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సమయం 1.20 గంటల్లోనే చేరుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ గరిష్ఠ వేగం గంటకు 320 కి.మీ.గా ఉండనుంది. అటు గుంటూరు-గుంతకల్లు మార్గంలో చేపట్టిన డబ్లింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పూర్తైతే నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ, గుంతకల్లు వైపు పలు కొత్త సర్వీసులు నడిపే అవకాశం ఉంది. కాగా, గతంలో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని అనుసంధానం చేస్తూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.