AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మంచిర్యాల జిల్లాలో అమానుషం.. క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను బాత్రూంలో బంధించిన భ‌ర్త

ఎవరికైనా కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఏం చేస్తారు..? ఆస్పత్రిలోనో లేక ఐసోలేషన్‌లోనో ఉంచి చికిత్స అందిస్తారు. కరోనా బాధితులకు...

Coronavirus: మంచిర్యాల జిల్లాలో అమానుషం.. క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను బాత్రూంలో బంధించిన భ‌ర్త
Corona
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2021 | 11:31 AM

Share

ఎవరికైనా కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఏం చేస్తారు..? ఆస్పత్రిలోనో లేక ఐసోలేషన్‌లోనో ఉంచి చికిత్స అందిస్తారు. కరోనా బాధితులకు కుటుంబ సభ్యులు ధైర్యం కల్పిస్తూ అండగా ఉంటారు. వైద్యుల సూచన మేరకు కరోనా తగ్గేంత వరకు ఆహారం, మందులు అందిస్తూ సేవలు చేస్తూ ఉంటారు. కానీ కరోనా సోకిన ఓ మహిళ పట్ల తన భర్త అమానుషంగా ప్రవర్తించాడు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిన మహిళ పట్ల ఆమె భర్త అమానుషంగా వ్యవహరించాడు. కరోనా సోకిందని బాధితురాలిని బాత్రూంలో బంధించాడు భర్త మేడి పెద్దయ్య. వారం రోజులుగా బాత్రూంలోనే కరోనా బాదితురాలు నరకయాతన అనుభవిస్తుంది. అన్నం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు . అయితే మహిళ సమస్యను టీవి9 దృష్టికి తీసుకు వచ్చారు స్థానికులు. టీవి9 చొరవతో పోలీసులు , వైద్యారోగ్యశాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఇంట్లో ఓ రూంలో ఐసోలేట్ చేయించారు. దాతల సహాయంతో పౌష్టికాహారం ఏర్పాట్లు చేశారు. కరోనా బాధితురాలి పట్ల భర్త అమానుష చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వ‌రం.. భ‌క్తుల‌కు నో ఎంట్రీ

టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా.. మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడి