Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టిన భర్త, అత్తమామలు..

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పెట్టిన చిత్రహింసలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టిన భర్త, అత్తమామలు..
Domestic Voilence
Follow us

|

Updated on: Apr 08, 2023 | 9:34 AM

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పెట్టిన చిత్రహింసలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకటలోని బీదర్ జిల్లాకు చెందిన నందినికి హైదరాబాద్ కు చెందిన రత్నదీప్ తో ఇటీవల పెళ్లి సంబంధం కుదిరింది. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులు వాళ్లిద్దరి పెళ్లి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా రత్నదీప్, అతని తల్లిదండ్రులు నందినిని అదనపు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వేధించి, చిత్రహింసలు పెట్టారు. ఇది చూసి భరించలేని నందిని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది.

ఆ తర్వాత మీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకెళ్లడంటూ రత్నదీప్ నందిని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్న నందిని తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూసి తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను చంపడమే కాకుండా కేసు వాపాసు తీసుకోకుంటే చంపుతామంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నందిని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నందినీ భర్త రత్నదీప్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. రత్నదీప్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..