AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఎందుకు చేశావమ్మా..! ఉండనని చెప్పినా హాస్టల్‌కు పంపించారని.. ఆ బాలిక ఏం చేసిందంటే..

వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన ఆశ్వితకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గత రెండు సంవత్సరాల క్రితం ఆరో తరగతిలో సీటు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆమెను జాయిన్ చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

ఇలా ఎందుకు చేశావమ్మా..! ఉండనని చెప్పినా హాస్టల్‌కు పంపించారని.. ఆ బాలిక ఏం చేసిందంటే..
Crime News (Representative image)
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 21, 2024 | 12:27 PM

Share

హాస్టల్లో ఉండలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది.. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన ఆశ్వితకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గత రెండు సంవత్సరాల క్రితం ఆరో తరగతిలో సీటు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆమెను జాయిన్ చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కూతురుకు ఉన్నత చదువులు చదివించాలన్న సంకల్పంతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించారు.

అయితే గత కొంత కాలంగా హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని ఆశ్విత తల్లిదండ్రులకు చెప్పింది. అయితే.. ఆమెకు ఎలాగొలా నచ్చజెప్పారు. పై చదువులు చదువుకుంటే.. ఉన్నత స్థానంలో ఉండొచ్చని తల్లిదండ్రులు ఆశ్వితకు పలుమార్లు చెప్పారు.. అయినా చిన్నారి వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే సెలవుల నేపథ్యంలో ఇంటికెళ్లింది.. తాను మళ్లీ హాస్టల్ కు వెళ్లనని.. అశ్విత చెప్పగా.. ఒక పది రోజులపాటు చదువుకుంటే దసరా సెలవులు వస్తాయని కాస్త ఓపిక చేసుకుని ఉండాలని చెప్పి నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు.

అయితే, అశ్వితకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక రాత్రి బిల్డింగ్ పై నుండి దూకింది. కింద పడిన ఆశ్వితను చూసిన తోటి విద్యార్థులు.. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో అధికారులు తల్లిదండ్రులకు సమచారం ఇచ్చి హుటాహుటిన ఆ బాలికను ప్రవైట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంటున్నారు.

తల్లి తండ్రులను వివరణ అడుగగా వసతి గృహంలో ఉండటం ఇష్టం లేక  అశ్విని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ అశ్విత చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించి ఆరోగ్యంపై డాక్టర్లను వివరణ అడిగారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని తెలిపారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఆశ్విత తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలని కూతురిని బాగ చూసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!