AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు బలి..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు పిడుగుపాటుకు పిట్టల్లా రాలిపోతున్నారు.

Telangana: పిడుగుల బీభత్సం.. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు బలి..!
Thunderstorm
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 06, 2024 | 5:58 PM

Share

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు పిడుగుపాటుకు పిట్టల్లా రాలిపోతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాయి. తాజా ఘటనలో ఓ విద్యార్థినితో సహా యువరైతు మృతి చెందారు.

గత వారం రోజుల నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అమాయకుల ఆయువు మింగేస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు బలయ్యారు. గురువారం(అక్టోబర్ 3) సాయంత్రం పిడుగుపాటుకు గురై ఆత్మకూరు మండలం చౌవులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. పత్తి చేనులో చేస్తుండగా పిడుగుపడి రామ, నిర్మల అనే ఇద్దరు అత్తా కోడళ్ళుగా అక్కడికక్కడే మృతి చెందారు. అదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో పిడుగుపాటుతో లక్ష్మి (45) అనే మహిళా రైతు మృతి. చెందింది.

ఇక, తాజాగా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మృతులు శ్రావణి అనే ఇంటర్ విద్యార్థిని తోపాటు, కూకట్ల రాజు అనే యువ రైతుగా గుర్తించారు. వారి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పశువుల కొట్టం కిందకు వెళ్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనలో మృత్యువాత పడ్డ ఇద్దరూ అవివాహితులే. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం