AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet: సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వంద మంది భూ నిర్వాసితుల అరెస్ట్‌..!

Siddipet: సిద్ధిపేట జిల్లాలో అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించారు..

Siddipet: సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వంద మంది భూ నిర్వాసితుల అరెస్ట్‌..!
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 6:43 PM

Share

Siddipet: సిద్ధిపేట జిల్లాలో అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తుగా నిర్వాసితులను అరెస్టులు చేస్తున్నారు. పోలీసులుకు భూ నిర్వాసితులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ నిర్వహించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో వంద మంది భూ నిర్వాసితులను అరెస్టు చేశారు పోలీసులు.

కాగా, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. దా దాపు 95 శతం వరకు పనులు పూర్తయ్యాయి. అయితే పంప్‌ హౌస్‌ పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2007లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టును సందర్శించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.43 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని 1.60 లక్షల ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి