AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. వారందరికీ నోటీసులు ఇచ్చిన ఈడి..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ.. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. అలాగే సిట్ అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

TSPSC Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. వారందరికీ నోటీసులు ఇచ్చిన ఈడి..
TSPSC Paper Leak
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2023 | 8:45 AM

Share

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ.. తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. అలాగే సిట్ అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

ఇదిలాఉంటే.. టీఎస్‌పీఎస్‌సీ కేసుపై మంగళవారం నాడు కీలక విచారణ జరుగనుంది. కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదించనుంది సిట్. మరోవైపు ఈ కేసును సీబీఐతో విచారించాలని ఎన్ఎస్‌యూఐ సహా పలువురు పిటిషనర్లు హైకోర్టును కోరారు. సీపీడీవో, ఈవో ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ చేయాలని, సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపైనా దర్యాప్తు జరపాలి పిటిషనర్లు కోరారు. తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపేసేలా స్టే ఇవ్వాలి విజ్ఞప్తి చేశారు పిటిషనర్లు. ఈమేరకు హైకోర్టులో 76 మంది అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టు నేడు విచారణ జరుపనుంది. పిటిషనర్ల తరుపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ తంఖా వాదించనుండగా.. సిట్ నివేదికను జతపరుస్తూ కౌంటర్ దాఖలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

నెల రోజుల పాటు విచారించిన సిట్.. మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేసింది. కీలక నిందితులుగా ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ లను పేర్కొంది. వీరు ఏఈ ఎగ్జామ్, గ్రూప్ -1, డిఎఓ ప్రశ్నా పత్రాలను లీక్ చేసినట్లు తేల్చింది సిట్. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ చైర్మన్ ను సైతం విచారించిన సిట్.. బోర్డు సెక్రెటరీ, బోర్డ్ సభ్యులస్టేట్మెంట్లను నివేదికలో పొందపర్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక సైతం జత పరిచింది. నిందితుల పెన్ డ్రైవ్, మొబైల్స్‌లో ప్రశ్న పత్రాలు ఉన్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 150 మందిని విచారించింది సిట్. గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులతో పాటు అనుమానితులను విచారించింది సిట్. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిందితుల ఇళ్ళలో రోజుల తరబడి సోదాలు నిర్వహించింది. గత నెల 11వ తేదీన బేగం బజార్ పిఎస్‌లో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు నమోదవగా.. ఆ తరువాత సిట్‌కు కేసు బదిలీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం