Weather Report: ఆ 20 మండలాల ప్రజలు జాగ్రత్త! అస్సలు బయటకెళ్లకండి..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో భానుడి భగభగలు హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో.. ప్రమాదకర స్థాయిలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం ఠారెత్తిపోతున్నారు.

Weather Report: ఆ 20 మండలాల ప్రజలు జాగ్రత్త! అస్సలు బయటకెళ్లకండి..!
Heat
Follow us

|

Updated on: May 16, 2023 | 9:35 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో భానుడి భగభగలు హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో.. ప్రమాదకర స్థాయిలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం ఠారెత్తిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదౌతోన్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో రాజమండ్రి, ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ, తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల ప్రాంతం భగ్గుమంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 50 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి ఉష్ణోగ్రతలు. వడదెబ్బతో తెలంగాణలో నిన్న ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మరణించారు. హసన్‌పర్తిలో ఒకరు మృత్యువాత పడ్డారు.

20 మండలాల్లో వడగాడ్పులు..

రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు, ఏలూరులో 48, భీమవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7 డిగ్రీలతో నిప్పులవర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలో 42 డిగ్రీలు, కాట్రేనికొనలో 40 డిగ్రీలు, ముమ్మిడివరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే 24 గంటల్లో 20 మండలాల్లో వడగాడ్పులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో.. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మిర్యాలగూడ 47, పాల్వంచలో 46 డిగ్రీలు, వరంగల్‌, నల్గొండలలో 43, జగిత్యాలలో 44, కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అడుగు బయటపెట్టాలంటే హడలిపోతున్నారు జనం. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం హడలెత్తిస్తోంది.

రామగుండం ఎప్పటిలానే అగ్నిగుండంలా మారింది. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంచిర్యాల జిల్లాలో మండిపోతున్న ఎండలతో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో పనిచేసే కార్మికులు పనివేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వరంగల్‌, హసన్‌పర్తిలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హసన్‌పర్తిలో వడదెబ్బకు ఓ కూలీ మృతిచెందాడు.

ఇక రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఎండలు భగ్గుమంటాయని హెచ్చరించింది ఏపీ వాతావరణ శాఖ.

సూర్య భగవనుడు శాంతించాలని వేడుకుంటూ కాజిపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 12రోజుల పాటు తీవ్రమైన ఎండలు వుంటాయని హెచ్చరించారు ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆఖరి కార్తీక సోమవారం..శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఆఖరి కార్తీక సోమవారం..శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
విండీస్‌ టీ20 జట్టులోకి విధ్వంసక ఆల్‌రౌండర్‌.. దబిడి దిబిడే ఇక..
విండీస్‌ టీ20 జట్టులోకి విధ్వంసక ఆల్‌రౌండర్‌.. దబిడి దిబిడే ఇక..
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
అయ్యయ్యో.. శోభాకు సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. నెటిజన్ల బూతులు
అయ్యయ్యో.. శోభాకు సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. నెటిజన్ల బూతులు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర'పై ఇంట్రెస్టింగ్ బజ్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర'పై ఇంట్రెస్టింగ్ బజ్..
ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్న ప్రవీణ్ కుమార్
ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్న ప్రవీణ్ కుమార్
"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..