AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్‌.. పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఈ నెల 30న..

టీ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తోంది. వరుస సమావేశాలతో క్యాడర్‌లో జోష్‌ పెంచుతోంది. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన PAC కీలక భేటీ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం, భవిష్యత్‌ ప్రణాళిక, ప్రియాంక పర్యటన, బస్సుయాత్రలపై చర్చించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి..

Telangana: దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్‌.. పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఈ నెల 30న..
Ts Congress
Narender Vaitla
|

Updated on: Jul 23, 2023 | 9:21 PM

Share

టీ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తోంది. వరుస సమావేశాలతో క్యాడర్‌లో జోష్‌ పెంచుతోంది. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన PAC కీలక భేటీ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం, భవిష్యత్‌ ప్రణాళిక, ప్రియాంక పర్యటన, బస్సుయాత్రలపై చర్చించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతల పీఏసీ సమావేశం ఆదివారం జరిగింది.

దాదాపు 3గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు. నెల 30న కొల్లాపూర్‌లో ప్రియాంకగాంధీ సభ, బస్సుయాత్రపై చర్చించినట్లు పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయన్నారు. దాంతోపాటు ఆగస్టు 15న ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ గర్జన సభ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షత జరుగుతుందన్నారు.

ఓబీసీ డిక్లరేషన్‌, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌, ముస్లిం అండ్‌ మైనార్టీ, మహిళల డిక్లరేషన్‌పై పీఏసీలో చర్చ జరిగిందన్నారు షబ్బీర్‌ అలీ. దాంతోపాటు బస్సుయాత్ర రూట్‌ మ్యాప్‌పై కూడా చర్చించామన్నారు. మరోవైపు టీ కాంగ్రెస్‌లో ఎన్నికల కమిటీ జాబితా అగ్గి రాజేసింది. ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడంతో పార్టీ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన అనుచురులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకొని నిరసన తెలిపారు. పొన్నం ప్రభాకర్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్