Ravanth Reddy: కృష్ణానదిలో జలదోపిడీకి కారణం కేసీఆరే -సీఎం రేవంత్‌రెడ్డి

కృష్ణా, గోదావరి నదులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులు చేసిన పాపాలను కప్పి పుచ్చె ప్రయత్నం చేస్తున్నారని, దీని వల్ల రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు లొంగిపోయిన విధానం వివరించారు..

Ravanth Reddy: కృష్ణానదిలో జలదోపిడీకి కారణం కేసీఆరే -సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy
Follow us

|

Updated on: Feb 04, 2024 | 4:17 PM

Ravanth Reddy: కృష్ణా, గోదావరి నదులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులు చేసిన పాపాలను కప్పి పుచ్చె ప్రయత్నం చేస్తున్నారని, దీని వల్ల రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు లొంగిపోయిన విధానం వివరించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణ గోదావరి నదుల మీద ప్రాజెక్ట్ ల ను కేంద్రాన్ని అప్పగించే విది విధానాలు ఖారారు చేశారని అన్నారు.

దీని కోసం బోర్డులను కూడా ఏర్పాటు చేశారని, ఇది పార్లమెంట్ ఆమోదం కూడా పొందిందన్నారు. 2014లో వారి హయాం లో చట్టం రూపొందిచారని, ఈ చట్టం ఇలా ఉండటానికి కారణం వీరేనని ఆరోపించారు. 811 టీఎంసిలను ఎలా విభజించుకోవాలి.. దీనిపై ఇరు రాష్ట్రాలు ఎలా పెంచుకోవాలి అనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. 2015 లో జరిగిన సమావేశంలో ఏపీకి 512, తెలంగాణకు 299 అంటూ అప్పుడే ఒప్పందానికి ఒప్పుకున్నారని అన్నారు.

299 టీఎంసీ లకు ఒప్పుకున్నది అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కృష్ణ పరివాహకం తెలంగాణ లోనే ఎక్కువ ఉంటుందన్నారు. కానీ పరివాహక ప్రాంతం ఆధారంగా పంపకాలు జరగలేదని మండిపడ్డారు. 500 టీఎంసీల నీటి హక్కులను ఏపీ కి దారదత్తం చేశారని ఆరోపించారు. గత ఏడాది జనవరి 27 న 16 వ కేఆర్‌ఎంబీ టింగ్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో కేంద్రానికి ప్రాజెక్ట్ లను అప్పగిస్తామని ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. 17 వ బోర్డు సమావేశంలో కూడా ఇదే జరిగిందన్నారు. 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దీని నిర్వహణ కోసం బోర్డుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి