AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్‌ ఏంటంటే.

తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ ఇప్పుడు అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టు నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నందున రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ కాలేకపోతున్నామని మూడు నెలలు గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు...

Telangana: గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్‌ ఏంటంటే.
Tspsc Group 2
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 4:45 PM

Share

తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ ఇప్పుడు అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టు నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నందున రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ కాలేకపోతున్నామని మూడు నెలలు గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు విన్నవిస్తున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి 200 మంది అభ్యర్థులు చేరుకొని వినతి పత్రాన్ని అందజేశారు. ఆగస్టు ఒకటి నుంచి 20వ తేదీ వరకు గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలు ప్రకటించారు . గురుకులాల సిలబస్, గ్రూప్-2 సిలబస్ వేరువేరుగా ఉన్నందున ఒకే అభ్యర్థి రెండు పరీక్షల సిలబస్ను కవర్ చేయడం ఇబ్బందిగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో గురుకుల పరీక్షలు ముగిసిన తర్వాత రెండు నెలల కు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.

దానితోపాటు గ్రూప్ 2 మూడవ పేపర్ ఎకానమీ లో గత సిలబస్ కు 70% అదనంగా చేర్చారని.. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో మానసికంగా కృంగిపోయి మూడు నెలలు చదవలేకపోయామని అభ్యర్థులు చెబుతున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మూడు నెలలపాటు గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలంటూ TSPSC నీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు గురుకుల.. అటు గ్రూప్-2 ఈ రెండు పరీక్షలకు అర్హతలు ఉన్నా ఒకే నెలలో నిర్వహించడం వల్ల ఏదో ఒక దాంట్లో తాము అవకాశం కోల్పోయే పరిస్థితి ఉందని.. వాయిదా వేసి తీరాలని కోరుతున్నారు.

టీఎస్పీఎస్సీ గత ఏడాది 783 పోస్టులకు గాను గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడించింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సుమారు 705 మంది అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సెంటర్లకు సంబంధించిన పాఠశాలలకు సెలవులు కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు గ్రూప్-2 వాయిదా వేయాలన్న డిమాండ్పై టీఎస్పీఎస్సీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు