AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Telangana: గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
Representative Image
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 10, 2025 | 9:02 PM

Share

నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు నడిరోడ్డుపై జంతుబలి ఇవ్వడంతో వామ్మో అని వనికి పోతున్నారు. ఈ సంఘటన మల్హార్ మండలం తాడిచర్ల గ్రామంలో జరిగింది.. బీ.సీ కాలనీ సమీపంలోని మూడు బజార్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు.. నడిరోడ్డుపై గొర్రెను బలిచ్చి అక్కడే పూజలు నిర్వహించారు.

ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు నడిరోడ్డుపై జంతుబలి చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే గ్రామ శివారులోని మూడు బజార్ల వద్ద క్షుద్రపూజలు నిర్వహించి జంతు బలిచ్చారని ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా క్షుద్రపూజల ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా చిత్ర పూజలు జరిపి జంతు బలిచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us