Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పొలంలో నీటి కోసం పదిసార్లు బోరు వేసిన రైతు.. తీరా పదకొండోసారి వేయగా..

ఆ రైతు తన పొలంలో నీటి కోసం పదిసార్లు బోరుబావి తవ్వాడు. తీరా పదిసార్లు బోరు తవ్వి మోటారు వేసినా.. ఏం ప్రయోజనం లేకపోలేదు. పదకొండోసారి బోరు తవ్వి మోటారు వేయడంతో.. అసలేం జరిగిందంటే.. ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి..

AP News: పొలంలో నీటి కోసం పదిసార్లు బోరు వేసిన రైతు.. తీరా పదకొండోసారి వేయగా..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 31, 2025 | 4:45 PM

పొలాలకు నీళ్లు కావాలన్నా, ఇంటి అవసరాలకు నీరు కావాలన్నా బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. అయితే బోరు వేసిన ప్రతిచోటా, ప్రతిసారీ నీరు పడుతుందా అంటే చెప్పలేం. బోరు వెయ్యగానే నీరుపడింది అంటే అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే రాను రానూ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయనే హెచ్చరికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు పడటం కొంచెం కష్టమే. అయితే ఓ రైతు నీటి కోసం 10 సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. అయినా ఎక్కడో ఆశ అతన్ని మరోసారి ప్రయత్నించేలా చేసింది. ఎట్టకేలకు గంగమ్మ కరుణించింది. మోటారు వేయకుండానే సహజసిద్ధంగా పాతాళ గంగమ్మ ఉబికి వస్తోంది.

శ్రీ సత్యసాయి జిల్లా, ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురం పంచాయతీ, పాలేనివారి పల్లిలో రైతు గంగరాజు పొలంలో బోరుబావి ఎండిపోయింది. లక్షలు ఖర్చుపెట్టి 10సార్లు బోర్లు వేయించాడు రైతు. చివరికి అప్పల పాలైపోయాడు. అయినా అతనిలో ఆశ చావలేవు. చివరిగా మరోసారి ప్రయత్నిద్దామని పదకొండోసారి బోరు వేయించాడు. వెయ్యి అడుగుల్లో బోరువేసిన నీళ్లు పడని ఈ రోజుల్లో బోరు వేయగానే పాతాళగంగ ఉప్పొంగింది. మోటారు ఆన్ చేయకుండానే నీళ్లు బోరుబావిలో పొంగి పొంగిపొర్లుతున్నాయి. గంగరాజు తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసుకునేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాడు. చివరకు అప్పు చేసి బోరు వేయించాడు. ఒక్కసారిగా నీరు ఉబికి రావడంతో గంగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్లకు గంగమ్మ కరుణించిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆనందంతో గంగమ్మకు పూజలు చేశాడు. గంగరాజు కష్టం ఫలించి బోరుబావిలో నీళ్లు పడటంతో ఇతర రైతులు సైతం హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి
ఏప్రిల్ 21లోగా బడిపిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు..వేసవి సెలవుల తేదీ
ఏప్రిల్ 21లోగా బడిపిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు..వేసవి సెలవుల తేదీ
పాలిసెట్‌ 2025కు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్..
పాలిసెట్‌ 2025కు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్..