AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. బండి సంజయ్ సవాల్..

తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే రాజకీయాల్లో...

Telangana: అది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. బండి సంజయ్ సవాల్..
Bandi Sanjay
Ganesh Mudavath
|

Updated on: Dec 08, 2022 | 2:56 PM

Share

తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్న ఆయన.. ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కవిత సారా దందా తో పాటు గా క్యాసినో లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల కోసం పాలసీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ లో 24 గంటలు పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్తున్నారని, కానీ అది పూర్తి అవాస్తవమని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను, సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా బండి సంజయ్ స్పందించారు. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతుండగా.. విజయం దాదాపు ఖరారైపోయింది. దీంతో తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోక తప్పదని మండిపడ్డారు. అభివృద్ధి చేసే వాళ్లే గెలుస్తారన్న బండి సంజయ్.. అవినీతిపరులు ఓడిపోతారని వెల్లడించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కాగా.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట్ మీదుగా వేంపేట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. వెంపెట్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఈరోజు మొత్తం12.6 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..