Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చికెన్ వ్యర్థాల సేకరణకు వేలం.. రికార్డు స్థాయిలో కోటి దాటిన టెండర్‌..!

టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 200 పైగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు. వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దాణాగా తయారు చేస్తారు. అనంతరం చేపల చెరువుల యాజమానులకు అమ్ముతారు. ఇలా చేసినందుకు నగరపాలక సంస్థకు రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ నిమిత్తం టెండర్లను ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహించగా ఊహించినదానికంటే ఎక్కువ రాయల్టీ లభించింది.

Telangana: చికెన్ వ్యర్థాల సేకరణకు వేలం.. రికార్డు స్థాయిలో కోటి దాటిన టెండర్‌..!
Khammam
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2023 | 8:48 PM

ఖమ్మం కార్పొరేషన్ అధికారులు నగరంలోని చికెన్ వ్యర్థాల సేకరణకు వేలం వేశారు. రికార్డు స్థాయిలో చికెన్ వేస్టేజీ సేకరణ గద్వాల ప్రాంత వ్యక్తి దక్కించుకున్నారు . జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన బాలరాజు అనే వ్యక్తి ఏకంగా రూ. కోటి 55 లక్షల 60 వేలకు టెండర్ ను దక్కించుకున్నారు. గతంలో ఈ టెండర్‌ను 44 లక్షల 44 వేలకు ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మూడురెట్లు అదనంగా ధర పలికింది.

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించగా.. ఆరుగురు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగవేలంలో రాయల్టీ పాటగా 40 లక్షలు నిర్ణయించారు. జోగులాంబ గద్వాల జిల్లా.. గద్వాలకు చెందిన బాలరాజు కోటి 55లక్షల 60వేలకు పాటను దక్కించుకున్నారు.

టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 200 పైగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు. వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దాణాగా తయారు చేస్తారు. అనంతరం చేపల చెరువుల యాజమానులకు అమ్ముతారు. ఇలా చేసినందుకు నగరపాలక సంస్థకు రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ నిమిత్తం టెండర్లను ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహించగా ఊహించినదానికంటే ఎక్కువ రాయల్టీ లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..