AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapping Politics: మరో మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. కొత్త రాజకీయ ప్రకంపనలు..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీనే రద్దు చేయాలని తెలంగాన బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tapping Politics: మరో మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. కొత్త రాజకీయ ప్రకంపనలు..!
Phone Tapping Case
Balaraju Goud
|

Updated on: Apr 05, 2024 | 9:56 AM

Share

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీనే రద్దు చేయాలని తెలంగాన బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో ట్యాపింగ్‌ కేసు కొత్త రాజకీయ వివాదానికి తెరలేపింది. కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపడంపై స్పందించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. లీగల్‌ నోటీసులతో తనను బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, బాధ్యులెవరో తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే పరువు తీసినట్లా అని యెన్నం ప్రశ్నించారు. కేటీఆర్‌ రెచ్చిపోయి నోటీసులు పంపారని, విచారణ ఎందుకు చేస్తున్నారని DGPకి కూడా నోటీసులు పంపాలన్నారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్నారు.

అసలు బీఆర్‌ఎస్‌ పార్టీనే రద్దు చేయాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి. నాడు షాడో సీఎంలా వ్యవహరించి నేడు తెలియదంటే ఎలా అన్ని ప్రశ్నించారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ఈడీని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును వాడుకుంటున్నాయని బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోపించారు. ఇదిలావుంటే, ఫోన్ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో కేటీఆర్‌ పంపిన లీగల్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్‌ స్పందించారు. క్షమాపణలు అడిగే ప్రసక్తే లేదని.. ఏదైనా లీగల్‌గానే ఫేస్ చేస్తామన్నారు. చూడాలి మరీ ఈ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.