AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్‌లో చేరబోయేవారి లిస్ట్‌ ఇదే.. జాబితాలో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌.. 15వ ప్లేస్‌లో పొంగులేటి పేరు..

కొద్దిసేపటి క్రితం రరాహుల్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ తర్వాత..పార్టీలో చేరబోయేవారి జాబితా విడుదల చేశారు. మొత్తం 35 మంది సభ్యులతో లిస్ట్‌ రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో జూపల్లి ఉండగా...15వ స్ధానంలో పొంగులేటి ఉన్నారు.

Telangana: కాంగ్రెస్‌లో చేరబోయేవారి లిస్ట్‌ ఇదే.. జాబితాలో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌.. 15వ ప్లేస్‌లో పొంగులేటి పేరు..
Congress
Sanjay Kasula
|

Updated on: Jun 26, 2023 | 4:43 PM

Share

ఢిల్లీ, జూన్ 26: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశం అయ్యారు. మరికాసేపట్లో పార్టీ కండువ కప్పుకోనున్నారు. రెండు రోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి చేరడంతో ఏఐసీసీ కార్యాలయం సందడిగా మారింది. కొద్దిసేపటి క్రితం రాహుల్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ తర్వాత.. పార్టీలో చేరబోయేవారి జాబితా విడుదల చేశారు. మొత్తం 35 మంది సభ్యులతో లిస్ట్‌ రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో జూపల్లి ఉండగా.. 15వ స్ధానంలో పొంగులేటి ఉన్నారు.

పొంగులేటి చేరిక నేపథ్యంలో ఢిల్లీ AICC ఆఫీస్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఠాక్రేతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు . ఠాక్రేతో ఖమ్మం కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి సమావేశమయ్యారు. పొంగులేటి చేరికపై తన వర్షన్‌ను వివరించారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా ఠాక్రేతో సమావేశమయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికపై చర్చించారు.

ఈ ఇద్దరు నేతలతోపాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు. గత నెల రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడనుంది.

ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసు వద్ద సందడి వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం