Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఒంటరి మహిళ.. కారణం అదేనా?

హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఆ మహిళ హత్యకు పాత కక్షలే కారణమా..! మరేదైనా మర్మం దాగి ఉందా..! కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఒంటరి మహిళ.. కారణం అదేనా?
Hanumakonda Crime
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 06, 2025 | 3:13 PM

Share

హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఆ మహిళ హత్యకు పాత కక్షలే కారణమా..! మరేదైనా మర్మం దాగి ఉందా..! కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హత్య భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో జరిగింది. సుమలత అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. గురువారం(జూన్ 05) రాత్రి ఆమెపై దాడిచేసిన గుర్తు తిరగని దుండగులు గొడ్డలితో నరికి హతమార్చారు. బయటికి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి సుమలత రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..

అయితే పాతకక్షలే ఈ హత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన గుల్ల రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. రాజుపై భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. రాజు పై ఉన్న రెండు కేసులో సుమలత ప్రధాన సాక్షిగా ఉంది. మే 11వ తేదీన ఒక కేసు విచారణ ఉన్న నేపథ్యంలో తన అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, గత కొన్ని రోజుల నుండి సుమలత పైన రాజు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. కానీ సుమలత అందుకు నిరాకరించడంతో పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను హతమార్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం రాజు పరారీలో ఉండగా.. ఈ హత్య వెనుక అన్ని అనుమానాలు అతని వైపే వేలు చూపిస్తుండడంతో అతడే హత్య చేసి పారిపోయి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే