5G Network: మీ స్మార్ట్ ఫోన్ 5G కి సపోర్ట్ చేస్తుందా? లేదా? ఇలా ఈజీగా తెలుసుకోండి..

శనివారం ఉదయం ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ సేవలపైనే..

5G Network: మీ స్మార్ట్ ఫోన్ 5G కి సపోర్ట్ చేస్తుందా? లేదా? ఇలా ఈజీగా తెలుసుకోండి..
5g Network
Follow us

|

Updated on: Oct 01, 2022 | 6:47 PM

శనివారం ఉదయం ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ సేవలపైనే పడింది. ప్రస్తుతం చాలా మంది వద్ద 4జి సపోర్ట్ చేసే మొబైల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో.. 5 సేవలను తమ మొబైల్‌లో వినియోగించుకునే అవకాశం ఉందా? అనే సందేహం అందరిలోనూ మెదులుతుంది. రీసెంట్‌గా ఫోన్ కొనుగోలు చేసిన వారిలోనూ ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి మీ ఫోన్ 5జి కి సపోర్ట్ చేస్తుందా? లేదా? అనేది ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ వార్త. ఇందులో మీ ఫోన్ 5జి కి సపోర్ట్ చేస్తుందా? లేదా అనేది తెలుసుకోండి..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో.. రకరకాల ఫీచర్లతో రకరకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా వరకు 5 సపోర్ట్ ఫోన్స్ అంటూ మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్లను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాకముందే.. 5జి సపోర్ట్ పేరుతో మొబైల్స్ మార్కెట్‌లో రావడం విశేషం. మార్కెట్‌లో రూ. 13 వేల నుంచి 1.50 లక్షల వరకు ఈ ఫోన్ల ధర ఉంది. మరి మొబైల్ నిజంగానే 5జి సపోర్ట్ చేస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం వినియోగదారులు ముందుగా, మొబైల్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఆ తర్వాత నెట్‌వర్క్ & ఇంటర్నెట్‌ ఆప్షన్ చెక్ చేయాలి. అక్కడ మొబైల్ నెట్‌వర్క్ కింద ఇచ్చిన ప్రియారిటీ నెట్‌వర్క్ టైప్‌పై క్లిక్ చేయాలి. ఓపెన్ అవగానే మొత్తం ఆప్షన్స్ కనిపిస్తుంది. అయితే, వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లు, వేర్వేరు ఆప్షన్స్ కలిగి ఉంటాయి. ఈ ఆప్షన్స్‌లో 5జి ఉంటే.. మీ మొబైల్ ఫోన్ కూడా 5జి కి సపోర్ట్ ఇస్తుందని భావించొచ్చు. అయితే, బ్యాండ్‌ల వ్యాత్యాసం కూడా ఉంటుంది. వీటి జాబితాను కంపెనీ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

దేశంలో మొదటి 5G నెట్‌వర్క్ ఏది?

భారతదేశంలో మొదటి 5G నెటవర్క్‌ను ఇంకా ఏ కంపెనీ ప్రారంభించలేదు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీపావళికి ముందే 5జి సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ జియో కంపెనీ ఇప్పటికే తన AGM లో తెలిపింది. అదే సమయంలో ఎయిర్‌టెల్ కూడా ఈ సంవత్సంర 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా 5జీ సేవలపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్. మరి ఈ రేసులో ఎవరు ముందుంటారనేది ఇప్పుడే చెప్పడం కష్టం. చూద్దాం ఎవరు మొదటి దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తారో.

ఇవి కూడా చదవండి

5G స్పీడ్ ఎంత?

నిపుణుల ప్రకారం.. 5G వేగం 4G కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. రెప్పపాటు వేగంతో పని చేసుకోవచ్చునని చెబుతున్నారు. మరి దీని స్పీ్డ్‌ను అనుభూతి చెందాలంటే కొద్దికాలం మాత్రం వెయిట్ చేయక తప్పదు.

5జీ సేవలు ప్రారంభం..

ఇదిలాఉండగా, ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగానే దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు మోదీ. డిజిటల్‌ ఇండియాలో కొత్త యుగం ప్రారంభమయ్యిందన్నారాయన. 2జీ కాలం నుంచి 5జీ కాలం లోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ. అదే సమయంలో మొబైల్‌ ఫోన్లను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారత్‌ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచలో మొబైల్‌ తయారీరంగంలో రెండో స్థానంలో ఉందన్నారు. 2014లో రెండు మొబైల్‌ తయారీ కంపెనీలుంటే ఇప్పుడు 200 కంపెనీలు ఉన్నాయన్నారు. 2014లో కేవలం 100 గ్రామాలకు మాత్రమే ఆప్టికల్‌ ఫైబర్‌ అందుబాటులో ఉంటే ఇప్పుడు లక్షా 70 వేల గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ అందుబాటు లోకి వచ్చినట్టు తెలిపారు.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు