AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: కన్నుల పండువగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. పుణీతులైన క్రీడా ప్రముఖులు.. వీడియో

జనవరి 21న అయోధ్యకు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇప్పుడు అయోధ్యలోనే ఉంటున్నారు. ఈ ఈవెంట్‌లో కుటుంబ సమేతంగా పాల్గొన్న కుంబ్లే.. ఇప్పుడు రామమందిరంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రామజన్మభూమిలో కనిపించాడు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరయ్యేందుకు జడేజా వచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Ayodhya Ram Mandir: కన్నుల పండువగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. పుణీతులైన క్రీడా ప్రముఖులు.. వీడియో
Ayodhya Ram Mandir Inauguration
Basha Shek
|

Updated on: Jan 22, 2024 | 12:49 PM

Share

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరగుతోంది. దేశ విదేశాల్లోని రామ భక్తులు ఈ చారిత్రక క్షణాలను చూస్తున్నారు. ఇక ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు అయోధ్యకు చేరుకున్నారు. ప్రముఖ క్రికెటర్లతో పాటు క్రీడా ప్రముఖులూ ఉన్నారు. జనవరి 21న అయోధ్యకు వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇప్పుడు అయోధ్యలోనే ఉంటున్నారు. ఈ ఈవెంట్‌లో కుటుంబ సమేతంగా పాల్గొన్న కుంబ్లే.. ఇప్పుడు రామమందిరంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రామజన్మభూమిలో కనిపించాడు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరయ్యేందుకు జడేజా వచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా అయోధ్యలో ఉండడంతో ఆమె ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ కూడా అయోధ్యలోనే ఉన్నాడు. ఈ శుభకార్యంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉన్న వెంకీ.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ క్షణాలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే అయోధ్య చేరుకున్నాడని, శ్రీరామప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కూడా పాల్గొననున్నాడని సమాచారం.

అయితే ఈ శుభకార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపంచలేదు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం హిట్‌మ్యాన్ ఈరోజు హైదరాబాద్‌కు వెళ్లనున్నాడని, అందువల్ల ప్రాణ ప్రతిష్ట వేడుకకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. వీరితో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్ సహా పలువురు ఇతర ఆటగాళ్లు సైతం ఆహ్వానాలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

సచిన్ టెండూల్కర్..

విరాట్ కోహ్లీ..

అనిల్ కుంబ్లే దంపతులు..

రవీంద్ర జడేజా..

సైనా నెహ్వాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..