Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆడండి.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 కి ఎంపికైన 215 మంది ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌

PM Modi: తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆడండి.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ
Pm Modi
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jul 21, 2022 | 5:10 PM

అద్భుతంగా ఆడాలని భారత ఆటగాళ్లకు ప్రధాని మోదీ సూచించారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 కి ఎంపికైన 215 మంది ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అథ్లెట్లలో స్ఫూర్తిని నింపేందుకు బుధవారం మోదీ వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. భారతదేశంలో క్రీడల కొత్త శకం మొదలైందన్నారు. మీరు తిరిగి రాగానే మనమంతా కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుందామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశ ప్రజలు గొప్పగా చేస్తున్నారు. మీరంతా గొప్ప అథ్లెట్లు అంటూ ప్రశంసించారు. మీరు న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది గుర్తుంచుకోవాలని అన్నారు. భారతదేశంలోని మూల.. మూలన క్రీడా ప్రతిభతో నిండి ఉందని మీరు నిరూపించాలన్నారు. ఆయన మాట్లాడుతూ..”ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి బాగా ఆడండి. ఎలాంటి బెదురు, బెరుకు లేకుండా ఆడండి. తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి” అని అథ్లెట్ల బృందంతో అన్నారు.

జూలై 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి

ఈ ఏడాది ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ కోసం 322 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఇప్పటికే ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం (IOA) ఈ జట్టులో 215 మంది ఆటగాళ్లను చేర్చగా, 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఈసారి కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన గత కామన్వెల్త్ గేమ్స్ పతకాల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడమే జట్టు ప్రయత్నం.

ఇక కామన్వెల్త్ గేమ్స్‌కు 322 మంది సభ్యులతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. 215 మంది అథ్లెట్లు 19 క్రీడా విభాగాలలో 141 విభిన్నఈవెంట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించ నున్నారు.

నీరజ్ చోప్రాపై స్పెషల్ ఫోకస్

ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, పివి సింధు, మీరాబాయి చాను, లోవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పునియా, రవి కుమార్ దహియా వంటి ప్రముఖులు జట్టులో ఉన్నారు. ఇది కాకుండా, ప్రస్తుత కామన్వెల్త్ ఛాంపియన్‌లు మనిక బాత్రా, వినేష్ ఫోగట్ అలాగే 2018 ఆసియా గేమ్స్ బంగారు పతక విజేతలు తాజిందర్‌పాల్ సింగ్ టూర్, హిమా దాస్, అమిత్ పంఘల్ కూడా ఈ బృందంలో ఉన్నారు.

భారత ఆటగాళ్లు 19 గేమ్‌ల్లో పాల్గొంటారు

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఎఫ్‌ఐ) వైస్ ప్రెసిడెంట్ రాజేష్ భండారీ జట్టుకు చెఫ్ డి మిషన్ (టీమ్ చీఫ్)గా ఉన్నారు. భారత క్రీడాకారులు 15 క్రీడలు, నాలుగు పారా క్రీడలలో పాల్గొంటారు. బాక్సింగ్ , బ్యాడ్మింటన్ , హాకీ, వెయిట్ లిఫ్టింగ్ , మహిళల క్రికెట్ , రెజ్లింగ్ వంటి క్రీడల్లో జట్టు రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి మహిళల క్రికెట్‌..

మహిళల క్రికెట్ (టీ20 ఫార్మాట్) తొలిసారిగా ఈ క్రీడల్లో భాగమైంది. కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఇప్పటికే బర్మింగ్‌హామ్ చేరుకోగా, మరికొందరు గ్లోబల్ టోర్నమెంట్‌లలో పాల్గొన్న తర్వాత నేరుగా అక్కడికి చేరుకుంటారు. మిగిలిన ఆటగాళ్లు న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతారు. కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ జూలై 23న ఆగంతుకుల కోసం అధికారికంగా ప్రారంభించారు. భారత జట్టు ఐదు వేర్వేరు ప్రదేశాల్లో బస చేయనుంది.

సలీమా సైకిల్‌పై తండ్రితో కలిసి హాకీ చూడటానికి వెళ్లేది

మా నాన్న కూడా హాకీ ఆడేవారని జార్ఖండ్‌కు చెందిన మహిళా హాకీ క్రీడాకారిణి సలీమా టెటే మోదీతో అన్నారు. నేనూ సైకిల్‌పై అతనితో కలిసి క్రీడలు చూడటానికి వెళ్లినట్లుగా చెప్పారు. అప్పటి నుంచే ఈ గేమ్‌కు స్ఫూర్తి వచ్చిందన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే పోరాటం అవసరమని అప్పుడే అర్థమైందన్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం..