Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uganda Blast: భారత ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.. హోటల్ వద్ద బాంబు పేలుడు..!

Uganda Para badminton International 2021: భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రస్తుతం ఉగాండాలో ఉంది. అక్కడ ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం కొద్ది రోజుల క్రితమే అక్కడికి చేరుకున్నారు.

Uganda Blast: భారత ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.. హోటల్ వద్ద బాంబు పేలుడు..!
Uganda Para Badminton International 2021
Follow us
Venkata Chari

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2021 | 6:19 PM

Uganda Para badminton International 2021: భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రస్తుతం ఉగాండాలోని కంపాలాలో ఉంది. అయితే అక్కడ జరిగిన ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు. జట్టు హోటల్‌కు 100 మీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో భారత ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ పలువురు గాయపడినట్లు సమాచారం. ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు కొద్ది రోజుల క్రితం ఉగాండా చేరుకుంది.

ఈ జట్టులో టోక్యో పారాలింపిక్స్-2021లో పతక విజేతలు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, ఇతర ఆటగాళ్లు ఉన్నారు. రెండు పేలుళ్లు జరిగాయని, పలువురు గాయపడ్డారని ఎన్టీవీ ఉగాండా తెలిపింది. ఒక పేలుడు ఎంపీకి అత్యంత సమీపంలో జరగగా, సెంట్రల్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరొకటి జరిగింది. అయితే అధికారులు ఎంపీని ఖాళీ చేయించారు. ఎన్టీవీ ఉగాండా ప్రమాదంలో మరణించిన రెండు మృతుల దేహాలను చూపించింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

భారత అధికారప్రతినిధి పెద్దగా సమాచారం ఇవ్వలేదు. పలు పేలుళ్లు జరిగాయని, పలువురు గాయపడ్డారని ఉగాండా సైనిక ప్రతినిధి తెలిపారు. అయితే మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఉగాండా రెడ్‌క్రాస్ ప్రతినిధి తెలిపారు. ఉగాండా పోలీసు ప్రతినిధి ప్రతిస్పందనపై స్పందించలేదు.

టోక్యో పారాలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన టోక్యో పారాలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. ప్రమోద్ భగత్ బంగారు పతకాన్ని గెలుచుకోగా, మనోజ్ సర్కార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించాడు. కృష్ణానగర్‌ బంగారు పతకం సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో మాత్రం భారత్ పతకం సాధించలేకపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలోనూ భారత బ్యాగ్‌ ఖాళీగా ఉంది.

Also Read: IND vs NZ: 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు.. రోహిత్ శర్మ తుఫాను ఇన్నింగ్స్.. భయపడుతోన్న కివీ బౌలర్లు..!

Pakistan Cricket Team: వివాదంలో పాకిస్తాన్ ఆటగాళ్లు.. సిరీస్‌ను రద్దు చేయాలంటోన్న బంగ్లా అభిమానులు.. అసలేం జరిగిందంటే?