AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివంగత ఫుట్‏బాల్ దిగ్గజంకు దక్కిన అరుదైన గౌరవం.. మారడోనా గుర్తుగా అతని స్నేహితుడు ఏం చేశాడంటే?

ఫుట్‏బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గుర్తింపుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోమవారం ప్రకటించాడు.

దివంగత ఫుట్‏బాల్ దిగ్గజంకు దక్కిన అరుదైన గౌరవం.. మారడోనా గుర్తుగా అతని స్నేహితుడు ఏం చేశాడంటే?
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2020 | 10:31 AM

Share

ఫుట్‏బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గుర్తింపుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోమవారం ప్రకటించాడు. గత నెల 25న మారడోన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నగల వ్యాపారి అయిన బాబీ మారడోనా స్నేహితులు కాగా ఎనిమిదేళ్ళ క్రితం అతడిని కేరళకు తీసుకువచ్చాడు బాబీ. ఈ మ్యూజియం కోల్‏కత్తలో లేదా దక్షణ భారత్‏లో నిర్మించే వీలుంది. “2011 నుంచి మారడోనాతో నాకు అనుబంధం ఉంది. తన రూపంతో చిన్న బంగారు విగ్రహాన్ని అతనికి ఇచ్చాను. అతను తన ఎత్తున్న బంగారు విగ్రహాన్ని చూడాలని ఉందని చెప్పాడని తెలిపాడు. అది కూడా ది హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‏ను గుర్తుకు తెచ్చేలా ఉండాలని ఆశించాడు. మారడోనా కోరికను నిజం చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజియం అతనికి అంకితం. అందులో అతని వ్యక్తిగత, ఆటకు సంబంధించిన విషయాలను పొందుపరుస్తాం” అని బాబీ తెలిపాడు. బాబీ చెమ్మనూరు అంతర్జాతీయ సంస్థకు మారడోనా ప్రచారకర్తగా పనిచేశాడు.