AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grand Welcome: టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అంబరాన్నంటిన సంబరాలు

ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత బృందానికి ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సంబరాలు అంబరాన్ని తాకాయి.

Grand Welcome: టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలకు గ్రాండ్ వెల్‌కమ్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అంబరాన్నంటిన సంబరాలు
India's Olympic Champions Return
Balaraju Goud
|

Updated on: Aug 09, 2021 | 8:36 PM

Share

India’s Olympic champions return: ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత బృందానికి ఘనస్వాగతం లభించింది. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా జపాన్ నుంచి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రుముఖులతో సహా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సంబరాలు అంబరాన్ని తాకాయి. బ్యాండ్‌మేళంతో స్వాగతం పలికారు అభిమానులు. మెడల్స్‌ విజేత మాస్క్‌లు ధరించి ఎయిర్‌పోర్టులో హల్‌చల్‌ చేశారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యద్భుత ప్రదర్శన చేసింది.

షోపీస్ ఈవెంట్ ముగింపు వేడుక కోసం టోక్యోలో తిరిగి వచ్చిన ఇతర భారతీయ అథ్లెట్లు కూడా సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. క్రీడాకారులు స్వాగతం పలకడానికి అభిమానులు, కుటుంబాలు విమానాశ్రయానికి చేరుకున్నారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శనివారం స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు మరియు గేమ్‌లలో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత అథ్లెట్ సాధించిన మొదటి పతకం ఇదే కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు లభించాయి. జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు నీరజ్‌ చోప్రా. హర్యానా హరికేన్‌ అభిమానులు భారీ ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.

టోక్యో గేమ్స్‌లో వరుసగా కాంస్యం, రజత పతకాలు గెల్చిన కుస్తీ వీరులు రవిదహియా , భజరంగ్‌ పూనియా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. “అలాంటి ప్రేమ మరియు గౌరవాన్ని అందుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది” అని పునియా అన్నారు.41 ఏళ్ల తరువాత ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించిన పురుషుల హాకీ జట్టుకు కూడా ఘనస్వాగతం లభించింది.

ప్రపంవవ్యాప్తంగా కరోనా మహమ్మరారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ ఈ సంవత్సరం COVID-19 ప్రేరిత పరిమితులతో జరిగాయి. అన్ని ఈవెంట్‌లు మూసిన తలుపుల వెనుక అభిమానులు లేకుండానే జరిగాయి. టోక్యో ఒలింపిక్స్‌లో 200 దేశాలకు చెందిన 11,000 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో (ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) భారతదేశం అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. టోక్యో క్రీడల్లో నీరజ్ (బంగారం), బజరంగ్ (కాంస్యం), మీరాబాయి చాను (రజతం), పివి సింధు (కాంస్యం), లోవ్లినా బోర్గోహైన్ (కాంస్యం), పురుషుల హాకీ జట్టు (కాంస్యం), రవి కుమార్ దహియా (రజతం) పతకాలు సాధించారు.

Read Also.. రాష్ట్రపతి ఎన్నికపై నాగబాబు సంచలన వ్యాఖ్య.. సంచలనం రేపుతున్న ట్వీట్: Nagababu on President Post Live Video.