విశాఖ తీరాన.. నేడు ఆస్ట్రేలియాతో తొలి టీ20

ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్లుగా పేరొందిన భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి టీ20 విశాఖ సాగరతీరాన జరగనుంది. మ్యాచ్‌ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా జరిగే ఈ తొలి మ్యాచ్‌తోనే పర్యాటక దేశం టూర్‌ కూడా మొదలవుతుంది. బ్యాటింగ్‌ స్వర్గధామంగా పేరొందిన పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. గత ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్ […]

విశాఖ తీరాన.. నేడు ఆస్ట్రేలియాతో తొలి టీ20
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:24 PM

ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్లుగా పేరొందిన భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి టీ20 విశాఖ సాగరతీరాన జరగనుంది. మ్యాచ్‌ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా జరిగే ఈ తొలి మ్యాచ్‌తోనే పర్యాటక దేశం టూర్‌ కూడా మొదలవుతుంది. బ్యాటింగ్‌ స్వర్గధామంగా పేరొందిన పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. గత ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్ డే మ్యాచ్‌కి ముందు వరకు టికెట్లు అమ్మాల్సి వచ్చింది. ఈమ్యాచ్‌కి మాత్రం రెండు రోజుల ముందే అన్ని ధరల టికెట్లు అమ్ముడయ్యాయి. స్టేడియం సామర్థ్యం 27,500 కాగా, మొత్తం టికెట్లు అమ్ముడు పోవడంతో నిర్వాహకుల్లో ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. ఇటీవల స్వదేశంలో ఎదురైన చేదు అనుభవానికి ఇక్కడ విజయంతో దీటైన జవాబు చెప్పాలని ఆసీస్ సిద్ధమవుతుండగా, టీ20ల్లో బలమైన జట్టుగా తన విజయపరంపరను కొనసాగించాలని భారత్ ఉవ్విల్లూరుతోంది.

విజయమే లక్ష్యంగా ఇరు జట్లు శనివారం ముమ్మర సాధన చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే, ప్రపంచ కప్‌కు ముందు టీమ్‌ ఇండియాకు చివరి సన్నాహక మ్యాచ్‌లివి. ఆస్ట్రేలియాతో జరిగే టీ20, వన్డేల్లో సత్తాచాటితే ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్పులోకి అడుగు పెట్టవచ్చని భారత్ అంచనా. సొంతగడ్డ, అభిమానుల అండ ఎలాగూ కలిసి వస్తుందని భారత్‌ భావిస్తోంది. ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్యా జట్టుకు దూరమైనా కెప్టెన్‌ కోహ్లీ చేరికతో జట్టు సమతూకంతో ఉంది. బ్యాటింగ్‌ పరంగా భారత్‌కు ఎటువంటి సమస్య లేదు. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌లు శుభారంభాన్ని అందిస్తే ఆ తర్వాత ధోనీ, కోహ్లీ, రిషబ్‌పంత్‌లు మిగిలిన పని పూర్తి చేస్తారు. ఆల్‌రౌండర్లు విజయ్‌శంకర్‌, కృనాల్‌ పాండ్యాలు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంటుండడం జట్టుకు అదనపు బలం.

ఇక బౌలింగ్‌ విభాగంలోనూ భారత్‌ బలంగానే ఉంది. భువనేశ్వర్‌, కులదీప్‌యాదవ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చినా ఉమేష్‌యాదవ్‌, బుమ్రా, చాహల్‌, కౌల్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగానే ఉంది. ఆస్ట్రేలియా టూర్‌లో తన స్పిన్‌ మాయాజాలంతో కంగారులను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్‌ సొంతగడ్డపై వారిని ఓ ఆట ఆడుకుంటాడనడంలో సందేహం లేదు.

ఇక, ఆసీస్ జట్టు భారీ అంచనాలతోనే భారత్‌లోకి అడుగుపెట్టింది. సొంత గడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడం ఒకటైతే, ప్రపంచకప్‌ ముందు సన్నాహక మ్యాచ్‌ల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. కెప్టెన్‌ పించ్‌ సహా ప్రధాన బ్యాట్స్‌మన్‌లంతా కీలక సమయాల్లో తడబడుతుండడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడం ఆ జట్టుకు పెద్ద సవాల్‌గా మారనుంది.

ఇరు జట్లు మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడం, బ్యాటింగ్‌కు అనుకూలమైనదని ఇక్కడి పిచ్‌కి పేరుండడంతో తొలి టీ20లో పరుగుల వరద పారుతుందని అంతా భావిస్తున్నారు. మ్యాచ్‌ హోరాహోరీగా సాగితే అభిమానులకు అది పండగే అని చెప్పొచ్చు.

Latest Articles
ఈ యోగాసనాలు వేశారంటే.. వేసవిలో కూడా కూల్‌గా ఉంటారు..
ఈ యోగాసనాలు వేశారంటే.. వేసవిలో కూడా కూల్‌గా ఉంటారు..
కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే..
కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే..
పండితుల ఆశీర్వచనం తీసుకున్న అసదుద్దీన్ ఒవైసీ
పండితుల ఆశీర్వచనం తీసుకున్న అసదుద్దీన్ ఒవైసీ
మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి
మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..