AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆసియా కప్ స్వ్కాడ్‌లోకి యుజ్వేంద్ర చాహల్ ఎంట్రీ.. ఎలాగో చెప్పేసిన సౌరవ్ గంగూలీ..

Asia Cup 2023: యుజ్వేంద్ర చాహల్ ఖచ్చితంగా జట్టులో ఉంటాడని అభిమానులు ఆశించారు. కానీ, అది జరగలేదు. చాహల్‌ కంటే అక్షర్‌ పటేల్‌కు ప్రాధాన్యం లభించింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అత్యుత్తమ బ్యాటింగ్ సామర్థ్యం కారణంగా యుజ్వేంద్ర చాహల్ కంటే అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యత ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు.

Team India: ఆసియా కప్ స్వ్కాడ్‌లోకి యుజ్వేంద్ర చాహల్ ఎంట్రీ.. ఎలాగో చెప్పేసిన సౌరవ్ గంగూలీ..
Team India
Venkata Chari
|

Updated on: Aug 25, 2023 | 12:04 PM

Share

Yuzvendra Chahal: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఇటీవలే ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సంజు శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా చేర్చారు. ప్రధాన టోర్నమెంట్ కోసం భారత జట్టు బలంగా కనిపిస్తోంది. కానీ, ఈ జట్టులో స్పెషలిస్ట్ లేదా లెగ్ స్పిన్నర్‌లకు చోటు దక్కలేదు.

యుజ్వేంద్ర చాహల్ ఖచ్చితంగా జట్టులో ఉంటాడని అభిమానులు ఆశించారు. కానీ, అది జరగలేదు. చాహల్‌ కంటే అక్షర్‌ పటేల్‌కు ప్రాధాన్యం లభించింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అత్యుత్తమ బ్యాటింగ్ సామర్థ్యం కారణంగా యుజ్వేంద్ర చాహల్ కంటే అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యత ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయడం ద్వారా సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారని గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో చాహల్ ఎలా పునరాగమనం చేయగలడో కూడా మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. సమీప భవిష్యత్తులో ఎవరైనా ఆటగాడు గాయపడితే, యుజ్వేంద్ర చాహల్ జాతీయ జట్టులో పునరాగమనం చేయగలడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అన్నారు.

టీమిండియా ఆసియా కప్ స్వ్కాడ్..

ఒక ఈవెంట్‌లో భాగంగా, సౌరవ్ గంగూలీ ఆసియా కప్ 2023కి ఎంపికైన భారత జట్టు గురించి మాట్లాడుతూ, ‘యుజ్వేంద్ర చాహల్ కంటే అక్షర్ పటేల్‌ని అతని బ్యాటింగ్ సామర్థ్యం కారణంగా జట్టు ఇష్టపడింది. కాబట్టి, ఇది మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఎవరైనా గాయపడినట్లయితే, చాహల్ తిరిగి రావొచ్చు. ఇది 17 మంది సభ్యుల జట్టు. ఏ కారణం చేతనైనా ఇద్దరు వ్యక్తులను తొలగించవచ్చు.

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. కెప్టెన్ కుల్దీప్ యాదవ్‌పై నమ్మకం ఉంచాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

మీడియాతో రోహిత్ శర్మ..

సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ 2023లో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

మీడియాతో స్వ్కాడ్ గురించి మాట్లాడుతున్న రోహిత్ శర్మ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..