AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT 2024: ఒలింపిక్స్‌లో టాప్ 5 దేశాల్లో భారత్: టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో అనురాగ్ ఠాకూర్

క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. డబ్బు కంటే క్రీడాకారులకు మీడియా మంచి గుర్తింపు ఇవ్వగలదని అన్నారు. నేను క్రికెట్‌ను వదిలిపెట్టాలని అనుకోలేదు, కానీ కుటుంబ పరిస్థితులు నేను ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నేను 25 సంవత్సరాల వయస్సులో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని అయ్యాను. 26 సంవత్సరాల వయస్సులో మేం ధర్మశాలలో క్రికెట్ స్టేడియం నిర్మించాం. ఆ తర్వాత రాజకీయాల దారులు తెరుచుకున్నాయి. బహుశా ఆ స్టేడియం నిర్మించకపోయి ఉంటే నేను నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీని అయ్యేవాడిని కాదంటూ చెప్పుకొచ్చారు.

WITT 2024: ఒలింపిక్స్‌లో టాప్ 5 దేశాల్లో భారత్: టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో అనురాగ్ ఠాకూర్
Anurag Thakur
Venkata Chari
| Edited By: |

Updated on: Feb 25, 2024 | 5:30 PM

Share

Union Sports Minister Anurag Thakur: దేశంలోని అతిపెద్ద TV9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024ని రాజధాని న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. రాజకీయాలు, క్రీడలు, వినోద రంగాలకు చెందిన అనుభవజ్ఞులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ‘గేరింగ్ అప్ ఫర్ స్పోర్ట్స్ అసెండెన్సీ’ సెషన్‌లో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొని భారతదేశంలో కొనసాగుతున్న క్రీడా విప్లవం గురించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. 1983కి ముందు క్రికెట్‌లో అంత డబ్బు ఉండేది కాదని, అప్పుడు బీసీసీఐ వద్ద కూడా అంత డబ్బు లేదని అన్నారు. కానీ, ప్రసార భారతి, బ్రాడ్‌కాస్టింగ్ మధ్య జరిగిన కేసులో బోర్డు గెలిచిన వెంటనే, క్రికెట్‌లోకి డబ్బు రావడం ప్రారంభమైంది. ఈ రోజు మనం మన క్రికెటర్లు ఎలా ప్రపంచ స్టార్‌లుగా మారారో చూస్తున్నాం. ఇప్పుడు క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలలో ఆటగాళ్లు తమ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే సమయం వచ్చిందని అన్నారు.

అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. నేడు ఖేలో ఇండియాతో సహా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ఇక్కడ ఆటగాళ్లకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, దాని ఫలితాలను మనం కూడా చూస్తున్నామని అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100కు పైగా పతకాలు సాధించడం ఇదే తొలిసారి. నేటి భారతదేశం తన పని తాను చేసుకుంటూ స్వయంచాలకంగా ఫలితాలను పొందుతోందని అన్నారు.

ఇంతకుముందు క్రీడాకారులు చాలా సమస్యలను ఎదుర్కొనేవారని, అయితే నేడు ఖేలో ఇండియా టాప్స్ పథకం కింద క్రీడాకారుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇదొక్కటే కాదు, విడిగా రూ.6 లక్షలు కూడా ఇస్తున్నామని అన్నారు. మన ప్రభుత్వం వేయికి పైగా క్రీడా కేంద్రాలను నిర్మించింది. ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందితే, ఎంతోమంది క్రీడాకారులు తమ ఉత్తమ ప్రతిభను వెలికితీయగలరని అన్నారు.

ఈ సెషన్‌లో టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ మాట్లాడారు. క్రీడా ప్రపంచంలో అగ్రరాజ్యాన్ని రూపొందించడంలో మీడియా కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని, ముందుగా ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు వచ్చి వారిలో విజయ భావన కలుగుతుందన్నారు. మొదట చరిత్ర సృష్టించి, ఆ తర్వాత కొత్త తరానికి అండగా నిలిచిన గోపీ పుల్లెల్ చంద్ మనందరికీ ఆదర్శం అని ఆయన అన్నారు.

క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. డబ్బు కంటే క్రీడాకారులకు మీడియా మంచి గుర్తింపు ఇవ్వగలదని అన్నారు. నేను క్రికెట్‌ను వదిలిపెట్టాలని అనుకోలేదు, కానీ కుటుంబ పరిస్థితులు నేను ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నేను 25 సంవత్సరాల వయస్సులో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని అయ్యాను. 26 సంవత్సరాల వయస్సులో మేం ధర్మశాలలో క్రికెట్ స్టేడియం నిర్మించాం. ఆ తర్వాత రాజకీయాల దారులు తెరుచుకున్నాయి. బహుశా ఆ స్టేడియం నిర్మించకపోయి ఉంటే నేను నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీని అయ్యేవాడిని కాదంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన