AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: టీమిండియాతో తలపడే విండీస్ జట్టు ఇదే.. 12 ఏళ్ల తర్వాత లెజెండరీ ప్లేయర్ రీఎంట్రీ..

India vs West Indies: వెస్టిండీస్ జట్టు 7 సంవత్సరాల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం భారతదేశానికి వస్తోంది. దీనికి ముందు విండీస్ జట్టు చివరిసారిగా 2018లో భారతదేశంలో టెస్ట్ సిరీస్ ఆడింది. ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్ కూడా ఆ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు.

IND vs WI: టీమిండియాతో తలపడే విండీస్ జట్టు ఇదే.. 12 ఏళ్ల తర్వాత లెజెండరీ ప్లేయర్ రీఎంట్రీ..
West Indies Test Squad For India Tour
Venkata Chari
|

Updated on: Sep 17, 2025 | 7:51 AM

Share

India vs West Indies: ఆసియా కప్ 2025 తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చి వెస్టిండీస్‌తో తలపడుతుంది. 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, వెస్టిండీస్ జట్టు టెస్ట్ సిరీస్ కోసం భారతదేశానికి వస్తోంది. ఈ పర్యటన కోసం విండీసస్ జట్టును ప్రకటించారు. క్రికెట్ వెస్టిండీస్ సెప్టెంబర్ 16, మంగళవారం నాడు 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. ఊహించినట్లుగానే, విండీస్ సెలక్షన్ కమిటీ మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను తొలగించింది. గత 12 సంవత్సరాలలో మొదటిసారి, బ్రాత్‌వైట్ ఏ టెస్ట్ సిరీస్‌లోనూ భాగం కావడం లేదు.

2013 తర్వాత తొలిసారి తగ్గుదల..

అక్టోబర్ 2 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో, విండీస్ జట్టు 2018 తర్వాత తొలిసారిగా భారత గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే, ఆ సిరీస్‌లో భాగమైన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఈసారి జట్టులో లేడు. చాలా కాలం పాటు వెస్టిండీస్ కెప్టెన్‌గా ఉన్న బ్రాత్‌వైట్, జనవరి 2025లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, అతను మూడవ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 నుంచి తొలగించారు.

ఇవి కూడా చదవండి

చాలా కాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అనుభవజ్ఞుడైన ఓపెనర్ బ్రాత్‌వైట్‌ను ఈసారి జట్టు నుంచి తప్పించారు. 2011లో వెస్టిండీస్ తరపున టెస్ట్ అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ బ్రాత్‌వైట్, డిసెంబర్ 2013 నుంచి నిరంతరం జట్టులో భాగమయ్యాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తొలిసారి జట్టుకు దూరంగా ఉన్నాడు.

ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ..

జూన్-జులైలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం విండీస్ సెలక్షన్ కమిటీ బ్రాత్‌వైట్ సహా మొత్తం ముగ్గురు ఆటగాళ్లను జట్టులో మార్చింది. భారత పిచ్, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, వెస్టిండీస్ జట్టులో స్పిన్నర్లకు స్థానం కల్పించింది. స్పిన్ ఆడే బ్యాటర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. తేజ్‌నరైన్ చంద్రపాల్ ఒకటిన్నర సంవత్సరాలకుపైగా తర్వాత జట్టులోకి తిరిగి రావడానికి ఇదే కారణం. అదే సమయంలో, 13 టెస్టులు ఆడిన టాప్ ఆర్డర్ బ్యాటర్ అలిక్ అథనాజ్ కూడా జనవరి 2025 తర్వాత తిరిగి వచ్చాడు. వీరితో పాటు, స్పిన్నర్ ఖరీ పియరీకి తొలిసారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది.

టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవెలాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, తేజ్‌నారెన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జాడెన్ సీల్స్.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

అక్టోబర్ 2-6 – మొదటి టెస్ట్, అహ్మదాబాద్

అక్టోబర్ 10-14 – 2వ టెస్ట్, న్యూఢిల్లీ.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..