AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లబచ్చా కాదురోయ్ పోటుగాడు.! 17 సిక్సర్లతో రోహిత్ ఫ్రెండ్ ఊహకందని ఊచకోత.. ఎవరంటే?

తిరువనంతపురంలో జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్ టీ20 టోర్నీలో విష్ణు వినోద్ రికార్డు సెంచరీ సాధించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేసి.. రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా..

పిల్లబచ్చా కాదురోయ్ పోటుగాడు.! 17 సిక్సర్లతో రోహిత్ ఫ్రెండ్ ఊహకందని ఊచకోత.. ఎవరంటే?
Kcl 2024
Ravi Kiran
|

Updated on: Sep 17, 2024 | 11:54 AM

Share

తిరువనంతపురంలో జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్ టీ20 టోర్నీలో విష్ణు వినోద్ రికార్డు సెంచరీ సాధించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేసి.. రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో త్రిసూర్ టైటాన్స్, అలెప్పీ రిపుల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది త్రిసూర్ టైటాన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన అలెప్పీ రిపుల్స్ జట్టును.. కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 53 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 90 పరుగులతో, కృష్ణ ప్రసాద్ 43 పరుగులతో ఆదుకున్నారు. దీంతో అలెప్పీ రిపుల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇవి కూడా చదవండి

ఇక 182 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన త్రిసూర్ టైటాన్స్‌కు ఓపెనర్ విష్ణు వినోద్ శుభారంభం అందించాడు. తొలి ఓవర్ నుంచే దూకుడైన ఆటతీరుతో.. అలెప్పీ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా విష్ణు వినోద్ బ్యాట్‌తో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా విష్ణు వినోద్ 45 బంతుల్లో 17 సిక్సర్లు, 5 ఫోర్లతో 139 పరుగులు చేశాడు. తన పేలుడు సెంచరీతో త్రిసూర్ టైటాన్స్.. 44 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది.

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా విష్ణు వినోద్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2018 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంత్ 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును విష్ణు వినోద్ సమం చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 2017లో శ్రీలంకపై హిట్‌మ్యాన్ 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..