AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ప్రపంచ కప్ 2023లో అతిపెద్ద సవాలు ఇదే.. రోహిత్ సేనను హెచ్చరించిన కపిల్ దేవ్..

ODI World cup 2023: ODI ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమ్‌ఇండియాకు అతిపెద్ద సవాల్‌ ఏమిటన్న దానిపై మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కీలక ప్రకటన చేశాడు.

Team India: ప్రపంచ కప్ 2023లో అతిపెద్ద సవాలు ఇదే.. రోహిత్ సేనను హెచ్చరించిన కపిల్ దేవ్..
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Jul 25, 2023 | 9:03 PM

Share

ODI ప్రపంచ కప్ ఈ సంవత్సరం భారతదేశంలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. 2011 తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్ (2023 World Cup) జరగడం ఇదే తొలిసారి. స్వదేశంలో జరిగిన చివరి వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి అభిమానులు జట్టుపై భారీ అంచనాలు పెట్టుకోనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టోర్నీలో టీమ్‌ఇండియాకు అతిపెద్ద సవాల్‌ ఏమిటన్న దానిపై మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కీలక ప్రకటన చేశాడు.

ప్రపంచకప్‌లో టీమిండియాకు అతిపెద్ద సవాల్‌ ఇదే..

టైటిల్ పోటీదారులుగా భారత్ 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్‌ బరిలోకి దిగనుంది. ట్రోఫీని మళ్లీ ఎత్తేందుకు ఆతిథ్య జట్టు అంచనాల భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ టోర్నీలో 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ మరో ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజయంపై కన్నేసింది. కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్ ఈవెంట్ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ, ‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రపంచకప్‌నకు ఇంకా జట్టును కూడా ప్రకటించలేదు. భారతదేశం ఎల్లప్పుడూ బలమైన పోటీదారుగా టోర్నమెంట్‌లోకి ప్రవేశిస్తుంది. చాలా కాలంగా ఇలాగే వస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ, ‘అన్ని వైపుల నుంచి అంచనాల ఒత్తిడిని జట్టు ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మేం స్వదేశంలో ప్రపంచకప్‌ను గెలుచుకున్నాం. జట్టులో ఎంపికైన వారు మళ్లీ దానిని చేయగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్‌ జరగనుంది. ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

బిజీ షెడ్యూల్‌..

ఈ సమయంలో క్రికెట్‌లో బిజీ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, పనిభారం, గాయాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని కపిల్ అన్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ మాట్లాడుతూ, ‘మా సమయం వేరు. మేము ఇంత క్రికెట్ ఆడలేదు. ఈ ఆటగాళ్లు 10 నెలలుగా క్రికెట్ ఆడుతున్నారు. అందువల్ల, గాయాల నుంచి శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. ఫిట్‌నెస్‌ను నిర్వహించడానికి వారికి వ్యక్తిగత ప్రణాళికలు అవసరం’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..