AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 4th Test: చివరి టెస్ట్.. రెండు ఫలితాలు.. ఆసీస్‌తో ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో రోహిత్ సేన..

Ahmedabad Test: అహ్మదాబాద్‌లో టీమిండియా భవితవ్యం తేలనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 టెస్ట్ ఫలితంతోపాటు రోహిత్ సేన WTC ఫైనల్‌ చేరుతుందా లేదా అనేది డిసైడ్ అవ్వనుంది.

IND vs AUS 4th Test: చివరి టెస్ట్.. రెండు ఫలితాలు.. ఆసీస్‌తో 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో రోహిత్ సేన..
Team India
Venkata Chari
|

Updated on: Mar 06, 2023 | 1:28 PM

Share

WTC Final: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టుకు ఇప్పుడు చివరి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ సవాలుగా మారింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ టెస్టులో గెలిస్తే, టీమ్ ఇండియా సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు WTC ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతే.. ఒకవైపు సిరీస్ డ్రా కావడంతోపాటు.. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.

గతంలో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇక్కడి మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం కష్టమే.. అంటే ఇక్కడ కచ్చితంగా ఫలితం వెలువడుతుంది. భారత జట్టు మాత్రం ఇక్కడ ఓడిపోతే, WTC ఫైనల్‌కు చేరుకోవడానికి శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఫలితం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు WTC ఫైనల్‌కు చేరుకుంది. రెండో ఫైనలిస్ట్ కోసం టీమ్ ఇండియా-శ్రీలంక మధ్య రేసు నెలకొంది. అహ్మదాబాద్‌లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే.. నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ డ్రా అయినా.. లేదా భారత జట్టు ఓడిపోయినా.. ఈ సందర్భంలో శ్రీలంక కూడా WTCకి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శ్రీలంక 2-0తో గెలవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేయలేకపోతే, అహ్మదాబాద్ టెస్టులో ఓడిపోయిన తర్వాత కూడా భారత జట్టు WTC ఫైనల్‌కు చేరుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..