AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: ఆస్ట్రేలియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌.. దూసుకొస్తోన్న మరో జట్టు?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 చివరి మ్యాచ్‌కి తేదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

WTC Final: ఆస్ట్రేలియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌.. దూసుకొస్తోన్న మరో జట్టు?
Wtc 2025 Points Table
Venkata Chari
|

Updated on: Dec 02, 2024 | 3:06 PM

Share

WTC 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ మార్గం సుగమమవుతోంది. ఇందుకు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల విజయం కూడా ప్రత్యేక కారణమైంది. అంటే శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా గెలుపొందగా, ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది.

ఈ రెండు జట్ల ఓటమితో టీమిండియాకు ఫైనల్స్‌లోకి ప్రవేశించే అవకాశం పెరిగింది. దీని ప్రకారం, ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 5-0, 4-0, 4-1, లేదా 3-0 తేడాతో గెలిస్తే ఫైనల్ ఖాయం.

భారత్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడు లేదా నాలుగో స్థానానికి పడిపోతుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గెలిచినా.. పాయింట్ల పట్టికలో భారత జట్టును అధిగమించలేవు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కౌంట్‌డౌన్..

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌ను 5-0 తేడాతో గెలిస్తే భారత జట్టు 67% పాయింట్లతో ఫైనల్‌లోకి ప్రవేశించడం ఖాయం.

టీం ఇండియా ఆస్ట్రేలియాను 4-0 తేడాతో ఓడించినట్లయితే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా శాతం 65.79 పాయింట్లకు చేరుకుంటుంది.

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నప్పటికీ 63% మార్కులతో టీమ్ ఇండియా ఫైనల్‌లోకి ప్రవేశించనుంది.

ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలిచినా, వారికి 62% పాయింట్లు మాత్రమే లభిస్తాయి.

శ్రీలంక జట్టు మిగిలిన అన్ని టెస్టు మ్యాచ్‌లు గెలిచినా.. కేవలం 61.53% మార్కులు మాత్రమే సాధించగలదు.

అంటే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌ను భారత జట్టు 5-0, 4-0, 4-1, లేదా 3-0 తేడాతో గెలిస్తే ఫైనల్‌ ఖాయం. ఎందుకంటే శ్రీలంక, న్యూజిలాండ్ తర్వాతి మ్యాచ్ లన్నీ గెలిచినా భారత్ కంటే ఎక్కువ పాయింట్లు రావు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో టీమిండియా ఓడిపోతేనే ఈ జట్లకు ఫైనల్స్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

దక్షిణాఫ్రికాకు అత్యుత్తమ అవకాశం..

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 69.44% పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. ఇది ఫైనల్ ఆడుతుందని కూడా నిర్ధారిస్తుంది.

టీమ్ ఇండియా 5-0 లేదా 4-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవనుంది. ఈ సందర్భంలో, ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడటం ఖాయం.

ఆస్ట్రేలియాకు అవకాశం ఉందా?

భారత్‌తో జరిగే సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1, 3-1, లేదా 3-2 తేడాతో గెలిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకుంటుంది. దీని ద్వారా టీమిండియాను అధిగమించి ఫైనల్స్‌లోకి ప్రవేశించవచ్చు. కాబట్టి బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ భారత జట్టుకు కీలకం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us