AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిపేరును తొలగించిన చాహల్ భార్య.. కట్ చేస్తే.. కొత్త జీవితం లోడ్ అంటూ షాక్ ఇచ్చిన టీమిండియా క్రికెటర్..

ప్రస్తుతం చాహల్ ఆసియా కప్ 2022లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో భారత జట్టు ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఇంటిపేరును తొలగించిన చాహల్ భార్య.. కట్ చేస్తే.. కొత్త జీవితం లోడ్ అంటూ షాక్ ఇచ్చిన టీమిండియా క్రికెటర్..
Yuzvendra Chahal Wife Dhanashree
Venkata Chari
|

Updated on: Aug 18, 2022 | 1:22 PM

Share

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయా? అంటే అవుననే సమాధానం నెట్టింట్లో వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. ఈ జంట ఒకప్పుడు తమ రొమాంటిక్ చిత్రాలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ జోడీ.. తాజాగా సోషల్ మీడియాలో సీక్రెట్ నోట్‌ను పంచుకుంటున్నారు. దీంతో ఈ జంట మధ్య చిచ్చు మొదలైందంటూ కామెంట్లు కురుస్తున్నాయి. సెలబ్రిటీలు విడిపోవడాన్ని లేదా విడాకులను సూచించడానికి సోషల్ మీడియాలో ఇంటిపేరును తొలగించడం ట్రెండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ జోడీ కూడా త్వరలో విడిపోబోతున్నారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

22 డిసెంబర్ 2020న యుజ్వేంద్ర, ధనశ్రీ తమ పెండ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. మరోసారి సీక్రెట్ పోస్టులతో నెటిజన్లను అయోమయంలో పడేశారు. ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ని తొలగించడంతో, అసలు చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఆమె తన పేరుగా ‘ధన్‌శ్రీ వర్మ’ని వాడుతోంది. ఇంతకుముందు ధన్‌శ్రీ చాహల్ అని ఉండేది. ఆ మరుసటి రోజే యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్ట్ తో ఈ అనుమానాలకు బలపడ్డాయని ఫ్యాన్స్ అంటున్నారు. “కొత్త జీవితం లోడ్ అవుతోంది” అంటూ ఇన్‌స్టా రీల్‌లో చాహల్ ఓ ఫొటోను పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు, ఈ జోడీ తమ బంధానికి బ్రేకులు పడుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మరి ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం చాహల్ ఆసియా కప్ 2022లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో భారత జట్టు ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో తలపడనుంది.