AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 10 నెలల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన రోహిత్, కోహ్లీ..

Team India Squad vs Australia: టీం ఇండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో రెండు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.

Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 10 నెలల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన రోహిత్, కోహ్లీ..
2023 ప్రపంచకప్ అనుభవం: "2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో మేం గెలవకపోయినా, ఒక జట్టుగా ఏదైనా సాధించాలని మేం బయలుదేరాం, ప్రతి ఒక్కరూ దానిని అమలు చేశారు. ఆ అనుభవం కూడా మాకు తర్వాత ఐసీసీ ఈవెంట్లలో బాగా ఉపయోగపడింది."
Venkata Chari
|

Updated on: Oct 04, 2025 | 5:05 PM

Share

Team India Squad vs Australia: వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో, రెండు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నాయి. ఈ పర్యటన కోసం బీసీసీఐ టీం ఇండియా జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఐపీఎల్ 2025 తర్వాత ఈ ఇద్దరు అనుభవజ్ఞులు మొదటిసారి మైదానంలో కలిసి కనిపించనున్నారు.

ఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు ప్రకటన..

ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించడానికి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దీంతో, వన్డే ఫార్మాట్‌కు కూడా భారత్‌కు కొత్త కెప్టెన్ దొరికాడు. శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అంటే రోహిత్ శర్మ ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా జట్టులో భాగం అవుతాడు. డిసెంబర్ 2021 తర్వాత రోహిత్ ఆటగాడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి.

రోహిత్ శర్మతో పాటు, విరాట్ కోహ్లీ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తరపున ఆడారు. అంటే దాదాపు ఏడు నెలల తర్వాత వారు తిరిగి టీమ్ ఇండియా తరపున ఆడనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇది భారత జట్టుకు తొలి వన్డే సిరీస్ అవుతుంది. ఇంకా , డిసెంబర్ 2020 తర్వాత ఆస్ట్రేలియాలో భారత జట్టుకు ఇదే తొలి వన్డే సిరీస్ అవుతుంది.

జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..

ఈ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో అతను ఆడుతున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో గాయం కారణంగా రిషబ్ పంత్ కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కూడా జట్టుకు దూరంగా ఉంటాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు వన్డే జట్టు.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వీ జైస్వాల్.

ఆస్ట్రేలియా టూర్ కి టీ20 జట్టు.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ( వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి , శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ ( వికెట్ కీపర్ ), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..