Telugu News Sports News Cricket news Team India former captain Virat Kohli disappointed after out from leg before on Day 1 of India’s warm up game vs Leicestershire
Leicestershire vs India: క్రీజులో పాతుకపొయిన విరాట్ కోహ్లీ, భారీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. కానీ, తన బ్యాడ్ ఫాంను గుర్తు చేస్తూ అంపైర్ భారీ షాక్ ఇచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లీ ఏం చేశాడంటే..
లీసెస్టర్షైర్తో జరుగుతోన్న సన్నాహక మ్యాచ్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు తడబడిన సంగతి తెలిసిందే. తొలి రోజున భారత బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ మేరకు క్రీజులో పాతుకపోయి, సెట్ అయినట్లే కనిపించాడు. కానీ, ఇంతలో అంపైర్ రూపంలో మరోసారి తన బ్యాడ్ లక్ ఎదురైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్లో 69 బంతులు ఆడిన విరాట్.. 33 పరుగులు సాధించాడు. ఫుల్-లెంగ్త్ బాల్కు ఫ్లిక్ చేయడానికి కోహ్లి లైన్ దాటి వెళ్లాడు. కానీ, అది మిస్ కావడంతో బౌలర్, ఫీల్డర్లు ఒకేసారి అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ తన వేలును పైకెత్తి, విరాట్ని ఔట్గా ప్రకటించాడు. అతను నిరాశతో వెనక్కి వెళ్ళే ముందు అంపైర్ వైపు గుర్రుగా చూసి, ఇది ఎలా ఔట్ అంటూ అడిగేశాడు. అలాగే, కోపంగానే కొద్దిసేపు అంపైర్తో మాట్లాడుతూ కనిపించాడు. అనంతరం నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో భారత్ 138/6తో ఉంది.
☝️ | Kohli (33) lbw Walker.@RomanWalker17 strikes again! This time he hits the pads of Kohli, and after a long wait the umpire’s finger goes up.
మొత్తంగా భారత్ 246 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక 21 పరుగుల వద్ద శుభ్మాన్ గిల్ పెవిలియన్ చేరగా, రోహిత్ 25, విహారి 3, కోహ్లీ 33, అయ్యర్ 0, జడేజా 13, శ్రీకర్ భరత్ 70 నాటౌట్, ఠాకూర్ 6, ఉమేష్ 23, షమీ 18 నాటౌట్గా నిలిచాడు.