AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఆడకుండానే ఫైనల్ చేరనున్న టీమిండియా, కివీస్ జట్లు.. పాక్, ఇంగ్లండ్ టీంలకు భారీ షాకే.. ఎందుకంటే?

IND vs ENG, NZ vs PAK: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో, భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఆడనున్నాయి. అయితే సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండానే రెండు జట్లూ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది.

T20 World Cup: ఆడకుండానే ఫైనల్ చేరనున్న టీమిండియా, కివీస్ జట్లు.. పాక్, ఇంగ్లండ్ టీంలకు భారీ షాకే.. ఎందుకంటే?
T20 world cup 2022 Semi Finals
Venkata Chari
|

Updated on: Nov 08, 2022 | 8:49 PM

Share

టీ20 ప్రపంచకప్2022(T20 World Cup 2022) చివరి దశకు చేరుకుంది. 4 సెమీఫైనలిస్ట్ జట్లను నిర్ణయించారు. తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా, రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా 15 ఏళ్ల తర్వాత టైటిల్ గెలవాలని చూస్తోంది. అయితే, అంతకంటే ముందు భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. అయితే టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండానే భారత జట్టు ఫైనల్ చేరగలదనే వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అది ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం..

భారత్‌ మాత్రమే కాదు, న్యూజిలాండ్‌ కూడా సెమీ ఫైనల్‌ ఆడకుండానే టైటిల్‌ మ్యాచ్‌కు చేరుకోగలదని అంటున్నారు. సెమీఫైనల్‌లు రెండూ వర్షం కారణంగా కొట్టుకుపోయిన పరిస్థితిలో మాత్రమే భారత్, న్యూజిలాండ్ జట్లు ఆడకుండానే ఫైనల్‌కు చేరుకోగలవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరగొచ్చని భావిస్తున్నారు.

అగ్రశ్రేణి జట్లు నేరుగా ఫైనల్‌కు..

నియమం ప్రకారం, మ్యాచ్ రద్దు అయితే, రెండు గ్రూపులలోని అగ్రశ్రేణి జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయి. న్యూజిలాండ్ జట్టు 7 పాయింట్లతో గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 8 పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. నవంబర్ 9న సిడ్నీలో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, నవంబర్ 10న అడిలైడ్‌లో భారత్ సవాల్ చేయనుంది.

ఇవి కూడా చదవండి

సిడ్నీలో వర్ష సూచన..

సిడ్నీ వాతావరణం గురించి మాట్లాడితే, మ్యాచ్ రోజున 50 శాతానికి పైగా వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణం క్షణక్షణం మారుతున్నప్పటికీ.. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురవకూడదని, లేకుంటే ఆడకుండానే ఔటవుతుందని పాకిస్థాన్ ప్రార్థిస్తూ ఉండాలి. మరోవైపు, నవంబర్ 10 న అడిలైడ్ వాతావరణం గురించి మాట్లాడితే, వర్షం పడే అవకాశం 4 శాతం మాత్రమే ఉంది. అంటే భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

వర్షం పడినా ఫైనల్‌కు టీమిండియా..

న్యూజిలాండ్ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. వర్షం కారణంగా గ్రూప్‌లోని కివీ జట్టు ఇప్పటికే ఒక మ్యాచ్ కొట్టుకుపోయింది. అదే సమయంలో, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు భారత్ గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ 2లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవ్వలేదు. అయితే, సెమీ ఫైనల్‌లో వర్షం కురిసినా భారత అభిమానులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండింటిలోనూ భారత్‌కు నష్టం వాటిల్లలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ